యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ కెరీర్ గత కొంతకాలంగా సినిమాలు లేక గందరగోళంలో పడింది. అయితే ఎట్టకేలకు మెల్లగా మళ్ళీ స్టార్ట్ అయింది. ప్రస్తుతం దిల్ రాజు నిర్మాతగా ఇద్దరి లోకం ఒకటే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాను నవంబర్ లో రిలీజ్ చేయడానికి చిత్ర బృందం సనాహాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమాతో పాటు రాజ్ తరుణ్ మాళవిక నాయర్‌ జంటగా శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో మరో సినిమా తెరకెక్కుతుతుంది. 'ఒరేయ్‌.. బుజ్జిగా' అనే టైటిల్ తో రొమాంటిక్ అండ్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్‌ అక్టోబర్‌ 12 నుంచి ప్రారంభమైంది. గతంలో దర్శకుడు కొండా విజయ్ కుమార్ తెరకెక్కించిన 'గుండెజారి గల్లంతయ్యిందే', 'ఒక లైలా కోసం' సినిమాలు సూపర్ హిట్ కావడంతో ఈ సినిమా మీద కూడా అంచనాలు బాగున్నాయి. 

ఇక సెకండ్ షెడ్యూల్‌ ప్రారంభమైన సందర్భంగా నిర్మాత కె.కె.రాధామోహన్‌ మాట్లాడుతూ.. ఫస్ట్‌ షెడ్యూల్‌ సక్సస్ ఫుల్ గా కంప్లీట్ చేశాం. రెండో షెడ్యూల్‌ ప్రారంభించాం. నాన్‌స్టాప్‌గా ఈ షెడ్యూల్‌ జరుగుతుంది. రాజ్‌ తరుణ్‌ ఎనర్జీకి తగిన క్యూట్‌ లవ్‌స్టోరీ కుదిరింది. సెన్సిటివ్‌ లవ్‌స్టోరీ 'గుండెజారి గల్లంతయ్యిందే' 'ఒక లైలా కోసం' వంటి సూపర్‌హిట్‌ సినిమాలని రూపొందించిన కొండా విజయ్‌కుమార్‌ మరో డిఫరెంట్‌ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. నంద్యాల రవి అద్భుతమైన డైలాగ్స్‌ రాశారు. ఇక ఈ సినిమాలో సీనియర్ నటి వాణీవిశ్వనాథ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. తప్పకుండా 'ఒరేయ్‌.. బుజ్జిగా' సినిమా అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. ఇది మా బేనర్‌లో మరో సూపర్‌హిట్‌ సినిమా అవుతుందని అన్నారు. 

వాణీ విశ్వనాథ్‌, నరేష్‌, పోసాని కృష్ణమురళి, అనీష్‌ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్‌ ఘోష్‌, అన్నపూర్ణ, సిరి, జయలక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్‌ ముఖ్యపాత్రలలో నటిస్తున్న ఈ సినిమాకి సంగీతం అనూప్ రూబెన్స్ అందిస్తున్నారు. ఇక చాలా రోజులుగా హిట్ కోసం తపిస్తున్న యంగ్ హీరో రాజ్ తరుణ్ ఈ సినిమాలతో మళ్ళీ మాంచి ఫాం లోకి రావాలని ట్రై చేస్తున్నాడు. మరి ఈ రెండిటిలో ఒక్కటైనా సూపర్ హిట్ అయితే కాస్త రాజ్ తరుణ్ ఉన్నాడని అనుకుంటారు.


మరింత సమాచారం తెలుసుకోండి: