ప్రస్తుత తెలుగు ఇండస్ట్రీ మొత్తం సినిమాలయం అయింది. దసరాను పురస్కరించుకొని చాలా సినిమాలు షూటింగ్ కి ముహుర్తాలు పెట్టుకొంటే, మరికొన్ని సినిమాలు మాత్రం రిలీజ్ డేట్ ఖరారు చేసుకున్నాయి. సంక్రాంతికి రైతులు ఎంత సంబరాలు జరుపుకుంటారో అంతకుమించిన విదంగా మేము వారి శ్రమను దూరం చేస్తాము అంటూ చాలా సినిమాలు  బరిలో దిగనున్నాయి. 


ఈ సంక్రాంతికి దాదాపుగా నాగుగైదు సినిమాలు బరిలో దిగుతున్నాయి. తెలుగు సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కలయికలో వస్తున్నా సినిమా సరిలేరు నీకెవ్వరూ .. ఈ సినిమాలో రష్మిక మందన్న నటిస్తుంది. ప్రకాష్ రాజ్, విజయశాంతి వంటి సీనియర్ నటులు ఈ సినిమాలో నటిస్తున్నారు. షూటింగ్ పూర్తకాబోతుంది. సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది. 


ఇకపోతే అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్నా సినిమా అల వైకుంఠపురములో సినిమా కూడా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ రెండు సినిమాలు సంక్రాంతికి బరిలోకి దిగబోతుంది. ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా కూడా షూటింగ్ చివరి దశలో ఉంది. మరి సినిమా సంక్రాంతికి మహేష్ సినిమాకు పోటీగా రాబోతుంది. 


ఇకపోతే, అధికారికంగా ప్రకటించకపోయినా మరో రెండు సినిమాలు కూడా ఇదే సీజన్‌ను టార్గెట్‌ చేస్తున్నాయి. నందమూరి కళ్యాణ్ రామ్‌ హీరోగా రూపొందించిన `ఎంత మంచివాడవురా`తో పాటుగా వెంకటేష్‌,  అక్కినేని నాగచైతన్యలు హీరోలుగా తెరకెక్కుతున్న మల్టీస్టారర్‌ మూవీ `వెంకీ మామ`ను కూడా సంక్రాంతి బరిలోనే రిలీజ్‌ చేయాలని భావిస్తున్నారు.మరి ఏ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో తెలియాల్సి ఉంది..అదే రోజు పోటీగా రజిని కాంత్ నటించిన దర్బారు సినిమా కూడా పోటీ పడబోతుందని సమాచారం.. ఇక పోటీలో నిలిచేదెవ్వరు.. గెలిచేదెవ్వరో చూడాలి.. 
  


మరింత సమాచారం తెలుసుకోండి: