ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ లో మొదటగా కనిపించిన బ్యూటీ పూజ హెగ్డే.. ఆ యాడ్ లో కనిపించి ఓన్ హౌస్ వెల్ సెటిల్ అయిన బాబుని పెళ్లి చేసుకుంటాను అంటూ పూజ చేసిన ఆ యాడ్ అందరిని ఆకట్టుకుంది. సినిమా వాళ్లకు కళ్ళు తిప్పుకోకుండా చేసింది. అలాంటిది పూజ హెగ్డే కి ఆ యాడ్ తో మంచి పేరును సంపాదించిన ఈ ముద్దుగుమ్మకు సినిమా అవకాశాలు మెండుగానే వచ్చాయి. 


మెగా వారసుడు వరుణ్ తేజ్ నటించిన ముకుందా సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా అనుకున్నంతగా మాత్రం ఆమెకు పేరును తీసుకురాలేదు. ఆ తరువాత అల్లు అర్జున్ నటించిన డీజే సినిమా లో హాట్ లుక్స్ నటించి సినీ దర్శకుల మనసును దోచుకుంది. మొన్న వచ్చిన మహర్షి సినిమా హిట్ అవ్వడంతో ఆమెకు ఇప్పుడు సినిమా అవకాశాలు మరింత ఎక్కువగా వస్తున్నాయి. వరుస సినిమాలలో నటిస్తుంది. 



ఈ జిగేలు రాణి పుట్టింది పెరిగింది చదివింది అంతా కర్ణాటక లోనే.. సినిమాలలోకి ఎప్పుడు అనుకోలేదట.. తండ్రి లాయర్ కావడంతో ఆమె అంత తల్లి సమక్షంలో పెరిగిందని ఆమె వెల్లడించింది. అలా సినిమాల్లోకి వచ్చింది. అమ్మాయి అందంగా ఉన్న కూడా మొదట్లో ఆఫర్లు రాలేదని వేరేలా చెప్పనక్కర్లేదు. ఇకపోతే ఆమె తెలుగు తో పాటు ప్రస్తుతం హిందీ చిత్రాల్లో కూడా నటిస్తూ బిజీగా ఉంది. 



ప్రస్తుతం పూజ మహర్షి సినిమా తరువాత హిందీలోకి కాలుపెట్టింది. కేవలం హీరోయిన్ గా నటించడమే కాదు రంగస్థలం సినిమాలో జిల్ జిల్ జిగేలు పాటలో నటించి అందరి మనసులో చెరగని ముద్రను వేసుకుంది. ఆ పాట ఎంత ఫెమస్ అయిందో తెలిసిన విషయమే. ఇకపోతే ఈ ముద్దుగుమ్మా అల్లు అర్జున్ సరసన మరోసారి జతకట్టబోతుంది. ఈ సినిమా తరువాత మరో రెండు మూడు సినిమాలలో నటిస్తుంది కూడా.. 


మరింత సమాచారం తెలుసుకోండి: