టాలీవుడ్ సినిమా పరిశ్రమకు లీడర్ సినిమా ద్వారా నటుడిగా ఎంట్రీ ఇచ్చిన యువ హీరో రానా, తొలి సినిమాతోనే నటుడిగా ప్రేక్షకుల్లో మంచి పేరు దక్కించుకున్నారు. ఆ తరువాత కొన్ని ప్రయోగాత్మక సినిమాలతో పాటు కమర్షియల్ సినిమాల్లో కూడా నటించిన రానా, అనూహ్యంగా రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాతో విలన్ అవతారం ఎత్తారు. అయితే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆ రెండు సినిమాలు ఎంతటి అత్యద్భుత విజయాన్ని అందుకున్నాయో మనకు అందరికీ తెలిసిందే. ఇక ఆ తరువాత ఆయనకు బాలీవుడ్ లో కూడా అవకాశాలు మరింతగా పెరిగాయి. 

ఇక ఇటీవల తెలుగులో తేజ దర్శకత్వంలో నేనే రాజు నేనే మంత్రి అనే సినిమాలో నటించి మంచి హిట్ ని దక్కించుకున్న రానా, ప్రస్తుతం హాతి మేరె సాతి, విరాటపర్వం 1992 అనే సినిమాల్లో హీరోగా నటిస్తున్నారు. అలానే త్వరలో గుణశేఖర్ తెరకెక్కించనున్న హిరణ్యకశ్యప సినిమాలో కూడా ఆయన నటించనున్నారు. ఇక ఇటీవల ఎంతో తగ్గిపోయి సన్నబడిన రానా ఫోటోలు చూసిన వారందరూ ఆయనకు ఏవైనా ఆరోగ్య సమస్యలు తలెత్తాయా అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయమై ఒక తెలుగు న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో రానా ఆరోగ్యం గురించి, ఆయన తండ్రి సురేష్ బాబు గారు కొన్ని సంచలన నిజాలు బయట పెట్టారు. వాస్తవానికి రానాకు చిన్నప్పుడే ఒక కంటికి సమస్య ఉందని, 

చిన్నవయసు కావడంతో పెరిగి పెద్దయ్యాక ఆ కంటికి ఆపరేషన్ చేయిస్తే అంతా మాములు అవుతుందని డాక్టర్లు చెప్పడంతో ఇన్నేళ్లూ ఆగామని అన్నారు. ఇక ఇటీవల రానాకు డాక్టర్ల సూచన మేరకు కంటికి శస్త్ర చికిత్స జరిగిందని, అయితే చికిత్స తరువాత తనకు టెన్షన్ వలన బిపి వంటివి కొంత అదుపులో లేకపోవడంతో ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు తలెత్తాయని, అయితే అది అతి త్వరలోనే సెట్ అవుతుందని, దానికి కూడా డాక్టర్లు ప్రస్తుతం మెరుగైన చికిత్స అందిస్తున్నారని అన్నారు. రాబోయే మరికొద్దిరోజుల్లో రానా, ఇదివరకటివలె మళ్ళి మాములుగా మీ అందరికి కనపడతారని సురేష్ బాబు చెప్పుకొచ్చారు....!!


మరింత సమాచారం తెలుసుకోండి: