సంక్రాంతి వచ్చిందంటే సినిమా పండగ వచ్చిందనే చెప్పాలి. తెలుగు వారికే కాదు, దక్షిణ భారతదేశంలో కుడా పెద్ద పండగ కావడంతో చాలా సినిమాలని  సంక్రాంతికే రిలీజ్ చేయడానికి పోటీ పడుతుంటారు. సంక్రాంతికి రిలీజ్ చేయడానికి కొన్ని రోజుల ముందే ప్రకటించేసి ఉంటారు. ప్రస్తుతం తెలుగులో సూపర్ స్టార్ మహేష్ "సరిలేరు నీకెవ్వరు" సినిమా ని సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.


మహర్షి సినిమా తర్వాత వస్తున్న చిత్రం కావడంతో పాటు అనిల్ రావిపుడి దర్శకత్వం చేయడంతో అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక మరో స్టార్ హీరో అయిన అల్లు అర్జున్ సినిమా "అల వైకుంఠ పురములో" కూడా ఈ సంక్రాంతికే రానుంది. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే నటిస్తుంది. అల్లు అర్జున్ నుండి ఈ సంవత్సరం సినిమా రాలేదు. దాంతో ఈ సినిమాపై అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు.


వీరిద్దరితో పాటు నందమూరి కళ్యాణ్ రామ్ "ఎంత మంచి వాడవురా" సినిమా కూడా సంక్రాంతికే ముస్తాబు అవుతోంది. సతీష్ వేగేశ్న దర్శకత్వం వహించిన ఈ సినిమా టీజర్ ఇటీవలే విడుదలైంది. సతీష్ వేగేశ్న దర్శకత్వం వహించిన" శతమానం భవతి" సంక్రాంతి కానుకగా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు కూడా అదే నమ్మకంతో సంక్రాంతి బరిలో నిలబడ్డాడు.


తెలుగు సినిమాలే కాకుండా మరో మూడు తమిళ చిత్రాలు కూడా సంక్రాంతికి రెడీ అవుతున్నాయి. రజనీ కాంత్, మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న "దర్బార్" సంక్రాంతి కానుకగా విడుదల చేస్తామని లాంఛింగ్ రొజే ప్రకటించారు ఇక విశాల్, తమన్నా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ యాక్షన్ మూవీ కూడా సంక్రాంతికి విడుదల చేయాలని నిర్మాతలు చూస్తున్నట్లు, తాజా సమాచారం. దీనితో పాటు సూర్య , మోహన్ బాబు ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న సురారై పోట్రు కూడా సంక్రాంతి బరిలోనే ఉంది. వీటితో పాటు కార్తీ నటిస్తున్న సుల్తాన్ అనే చిత్రం కూడా ఇదే సీజన్ కి విడుదలయ్యే అవకాశం కలదు.



మరింత సమాచారం తెలుసుకోండి: