రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి వరుసగా రెండు బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు అందుకొన్నాడు. వివి వినాయక్ దర్శకత్వంలో 'ఖైదీ నెంబర్ 150' తీసిన తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'సైరా' సినిమాతో రెండు వరుస విజయాలు అందుకోవడం జరిగింది. అయితే రెండు సినిమాలలో సైరా సినిమా అదిరిపోయే హిట్ అందుకుంది. చిరంజీవి కెరియర్ లోనే ఇంద్ర లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ సైరా సినిమా తో అందుకున్నాడని చాలామంది సినిమా చూసిన అభిమానులే గాని ఇండస్ట్రీలో ఉన్న వారే గాని సోషల్ మీడియాలో స్పందించడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో ఈ సినిమా అయిన వెంటనే కొరటాల శివ తో సినిమా మొదలు పెట్టిన చిరంజీవి ఆ సినిమా షూటింగ్ మొదలు కాకముందే మరొక సినిమా అనగా 153వ సినిమా చేయటానికి చిరంజీవి రెడీ అయినట్లు ఫిలింనగర్ లో వార్తలు వినపడుతున్నాయి.


పైగా ఆ సినిమా ని డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం చేయబోతున్నట్లు సమాచారం. సుకుమార్ మెగా కాంపౌండ్ హీరోలు అయిన అల్లు అర్జున్, రామ్ చరణ్ లకు అదిరిపోయే విజయాలు అందించడం జరిగింది. ముఖ్యంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి కెరియర్ లోనే అతిపెద్ద బిగ్గెస్ట్ సినిమాగా 'రంగస్థలం' అనే సినిమా ఇవ్వటం జరిగింది. దీంతో తండ్రి చిరంజీవి సినిమాలలో ఎక్కువ చొరవ తిసుకుంటున్న రామ్ చరణ్...సుకుమార్ డైరెక్షన్ లో చిరంజీవి చేయటానికి ఎక్కువ పాత్ర పోషించినట్లు చిరంజీవిని ఒప్పించడం జరిగినట్లు, సుకుమార్ ని రికమండేషన్ చేసినట్లు ఫిలింనగర్ లో వార్తలు వినబడుతున్నాయి.


'రంగస్థలం' వంటి హిట్ ఇవ్వడం తో సుకుమార్ కి రామ్ చరణ్ ఈ అవకాశం ఇచ్చినట్లు సమాచారం. అయితే ఇది రాజకీయ ప్రధానాంశంగా సినిమా తియడానికి చిరంజీవి లో అద్భుతమైన రాజకీయ నాయకుడిని వెండితెరపై చూపించడానికి సుకుమార్ స్టోరీ రెడీ చేస్తున్నారట. అయితే అధికారికంగా మాత్రం ఈ వార్త ఎక్కడ కూడా బయటికి రాలేదు. 



మరింత సమాచారం తెలుసుకోండి: