ఈరోజు పూజ హెగ్డే  పుట్టినరోజు సందర్భంగా 'అల వైకుంఠపురములో' మూవీ యూనిట్ ఈ రోజు విదుదల చేసిన పూజ హెగ్డే కి సంబంధించిన స్టిల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం టాప్ హీరోలు అందరితోను నటిస్తున్న పూజ హెగ్డే ప్రస్తుతం  టాలీవుడ్ ఇండస్ట్రీ గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా మారింది.  

ఈ రోజు పూజ హెగ్డే పుట్టినరోజు సందర్భంగా ‘అల వైకుంఠపురములో' సినిమాకి సంబంధించి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసి  చిత్రయూనిట్ పూజాని ప్రశంసల్లో ముంచెత్తింది. ఆమె హార్డ్ వర్కింగ్ చేసే హీరోయిన్ అని,అంటూ  కొత్త జెనరేషన్ లో అత్యంత ఆకర్షణీమైన లేడీ అంటూ ఆమె పై ప్రశంసలు కురిపించారు.  

ఈరోజు ఈ చిత్రయూనిట్ షేర్ చేసిన ఫోటోలో  చేతికి గ్లౌజులు వేసుకొని పూజా హెగ్డే  కనిపిస్తూ ఆమె బాక్సర్ రోల్ లో ఈ మూవీలో కనిపిస్తుందా అన్న సందేహాలు క్రియేట్ చేస్తోంది. దీనితో పూజ అల్లు వారబ్బాయికి పంచ్ ఇచ్చేందుకు రెడీ అవుతుందా అంటూ జోక్స్ పడుతున్నాయి. సంక్రాంతికి రాబోతున్న 'అల వైకుంఠపురములో' మూవీలో త్రివిక్రమ్ దర్శకత్వ విశ్వరూపం కనిపించ బోతోంది అంటూ అంచనాలు వస్తున్నాయి. 

ప్రస్తుతం  టాప్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగిపోయిన పూజ తాను నటించే సినిమాకు 2కోట్ల పారితోషికం తీసుకునేస్థాయికి  ఎదిగింది. వరస ఫ్లాప్ లతో సతమత మవుతున్న యంగ్ హీరో అఖిల్ సినిమాలో ఈమెను ఎరికోరి 3 కోట్ల పారితోషికం ఇచ్చి పెట్టుకున్నారు అంటే పూజ హెగ్డే మ్యానియా నేడు ఏ రేంజ్ లో ఉందొ అర్ధం అవుతుంది. ప్రస్తుతం బన్ని త్రివిక్రమ్ ల కెరియర్ కు అత్యంత కీలకంగా మారిన 'అల.. వైకుంఠపురములో' మూవీ సక్సస్స్ కు పూజ హెగ్డే గోల్డెన్ లెగ్ ఎంతవరకు సహకరిస్తుందో చూడాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: