పూజా హెగ్డే ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. పెద్ద పెద్ద స్టార్ హీరోలతో అవకాశాలు ఆఫర్లు దక్కించుకుంటూ అదిరిపోయే బ్లాక్ బస్టర్ లు అందుకుంటూ బిజీ హీరోయిన్ అయిపోయింది. అక్కినేని నాగచైతన్య నటించిన ‘ఒక లైలా కోసం’ అనే సినిమాలో హీరోయిన్ గా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో స్టార్ హీరోలందరి పక్కన వరుస ఆఫర్లు దక్కించుకుంటూ బాక్సాఫీస్ ని షేక్ చేసే సినిమాలు చేయడం జరిగింది. అంతే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో హృతిక్ రోషన్ సరోజన క్రేజీ ప్రాజెక్ట్ మొహంజోదారోలో న‌టించే ఛాన్స్ కొట్టేసింది. ఇటీవల మెగా కాంపౌండ్ హీరో మెగా ఫ్రెండ్స్ వరుణ్ తేజ్ నటించిన గజ్జలకొండ ఈ సినిమాతో అదిరిపోయే హిట్ అందుకుంది.


అంతేకాకుండా అల్లు అర్జున్ తో ‘దువ్వాడ జగన్నాథం’ మరియు ఎన్టీఆర్ తో ‘అరవింద సామెత వీర రాఘవ’ , మహేష్ బాబుతో ‘మహర్షి’ లాంటి క్రేజీ ప్రాజెక్టులు నటించి తెలుగు సినిమా కుర్రకారు మరియు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న పూజా హెగ్డే ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న అల వైకుంఠ‌పురంలో హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ సినిమాలో ఆమెకు బర్త్ డే విషెస్ చెపుతూ ఓ పోస్ట‌ర్ రిలీజ్ చేశారు. ఈ పోస్ట‌ర్‌లో పూజ‌ రెడ్ బాక్సింగ్ గ్లోవ్స్ ధరించుకొని ఎవరినో రఫ్ ఆడేస్తోంది. కాగా ఈ సినిమాలో పూజా హెగ్డే సాఫ్ట్‌వేర్ కంపెనీకి...బాస్ గా నటిస్తోందట.


అంతేకాకుండా పూజ దగ్గర అల్లుఅర్జున్ ఎంప్లాయి గా పని చేస్తాడని...దీంతో అల్లు అర్జున్ ని తన కంపెనీలో ముప్పుతిప్పలు పెట్టే సన్నివేశాలు ఈ సినిమాలో ఉంటున్నట్లు ఫిలింనగర్లో వార్తలు వినబడుతున్నాయి. ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందిన వ్యక్తిగా అల్లు అర్జున్ ఈ సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం. ఇదే క్రమంలో బాగా డబ్బు ఉన్న అమ్మాయి పాత్ర లో...పూజ హెగ్డే క్యారెక్టర్ ఉంటుందని సమాచారం. దీంతో వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలలో అల్లు అర్జున్ ని సినిమాలో పూజ హెగ్డే అష్టకష్టాలు పెడుతుందట. మరి అల్లు అర్జున్ ఈ సినిమాలో ఎన్ని కష్టాలు పడ్డాడో చూడాలి అంటే వచ్చే సంక్రాంతి వరకు ఆగాల్సిందే. 



మరింత సమాచారం తెలుసుకోండి: