ఎప్పటి నుంచో బాలీవుడ్ లో సరైన హిట్స్ లేక సతమతమౌతు మంచి కమర్షియల్ సక్సస్ కోసం ఎంతగానో ఎదురుచూసిన బాలీవుడ్ యంగ్ హీరో షాహిద్ కపూర్ తెలుగులో సూపర్ హిట్ అయిన 'అర్జున్ రెడ్డి' సినిమాని రీమేక్ చేసి 'కబీర్ సింగ్' పేరుతో విడుదల చేస్తే బాలీవుడ్ లో ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. అంతేకాదు ఈ ఒక్క సినిమాతో షాహిద్ అక్కడ స్టార్ హీరోల జాబితాలో చేరిపోయాడు. ఒకరకంగా చాలా కాలంగా కంటున్న కల నిజమైంది 'కబీర్ సింగ్' సినిమాతో. అంతేకాదు ఆ తర్వాత నుండి షాహిద్ కమిటయ్యో కొత్త సినిమాలకు రెమ్యూనరేషన్ కూడా భారీగా పెంచేశాడు. దాదాపుగా తను సైన్ చేసిన సినిమాకు ప్రస్తుతం 40 కోట్ల రెమ్యూనరేషన్ అడుగుతున్నాడని బాలీవుడ్ లో అనుకుంటున్నారు. 

షాహిద్ తన తర్వాత సినిమా కూడా తెలుగు సినిమానే రీమేక్ చేస్తున్నాడు. బహుషా మళ్ళీ ఈ సినిమాతో మరోసారి బాలీవుడ్ లో పెద్ద కమర్షియల్ సక్సస్ ను అందుకోవాలని గట్టిగా డిసైడయ్యాడని అర్థమవుతోంది. అందుకే గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని హీరోగా నటించిన 'జెర్సీ' సినిమా తెలుగులో మంచి పేరు తెచ్చుకుంది. ఇందులో నాని నటన అద్భుతం అని ప్రేక్షకులు, ఇండస్ట్రీ వర్గాలతో పాటు క్రిటిక్స్ కూడా విపరీతంగా మెచ్చుకున్నారు. కమర్షియల్ గా కాస్త నానీకి తృప్తి ని ఇవ్వలేకపోయినప్పటికి నాని కెరీర్ లో జెర్సీ ఒక గొప్ప సినిమాగా మిగిలిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు ఈ సినిమాపై షాహిద్ మనసు పారేసుకున్నాడు. అందుకే ఈ సినిమాను బాలీవుడ్ ప్రొడ్యూసర్ అమన్ గిల్ తో కలిసి టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు - అల్లు అరవింద్ లు హిందీలో నిర్మిస్తున్నట్టు తెలుస్తుంది. 

అంతేకాదు ఈ విషయం గురించి ఇంతకముందే వార్తలు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. ఇక 'జెర్సీ' సినిమా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి హిందీ సినిమాకి కూడా డైరెక్షన్ చేయనున్నాడని తాజా సమాచారం. తెలుగులో నేచురల్ స్టార్ నాని సరసన హీరోయిన్ గా నటించినన శ్రద్ధ శ్రీనాథ్ పాత్రను హిందీలో రష్మిక మందన్న చేస్తుందని లేటెస్ట్ న్యూస్. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ చేసి వచ్చే సంవత్సరం ఆగస్టులో విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నారని బాలీవుడ్ మీడియా సమాచారం.   



మరింత సమాచారం తెలుసుకోండి: