టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ప్రస్తుతం మంచి హిట్స్ తో అలానే వరుస అవకాశాలతో దూసుకుపోతున్న భామ ఎవరయ్యా అంటే, ఎక్కువమంది నోటి నుండి వచ్చే పేరు పూజ హెగ్డే. ప్రస్తుతం ఈ భామకు టాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. అంతేకాదు ఈమెకు టాలీవుడ్ గోల్డెన్ లెగ్ అనే పేరు కూడా వచ్చింది. తొట్టతొలిగా అక్కినేని నాగచైతన్య సరసన ఒక లైలా కోసం సినిమాతో టాలీవుడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన పూజా, తొలి సినిమా ఫెయిల్యూర్ తో కొంత ఆలోచనలో పడింది. ఆ తరువాత వరుణ్ తేజ్ డెబ్యూ సినిమా ముకుందలో హీరోయిన్ గా నటించగా, అది కూడా ఫెయిల్ అయింది. అయితే ఆ తరువాత కొంత గ్యాప్ తీసుకుని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన డిజెలో నటించి మంచి హిట్ అందుకుంది. 

అనంతరం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో చేసిన సాక్ష్యం పర్వాలేదనిపించినప్పటికీ, దాని తరువాత జూనియర్ ఎన్టీఆర్ హీరోగా చేసిన అరవింద సమేత సూపర్ హిట్ తో మంచి పేరు సంపాదించింది. ఇక ఆ తరువాత సూపర్ స్టార్ మహేష్ తో మహర్షి వంటి ఎపిక్ బ్లాక్ బస్టర్ కొట్టిన ఈ భామ ప్రస్తుతం ప్రభాస్ సరసన జాన్ అలానే, మరొక్కసారి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన అల వైకుంఠపురములో సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోంది. ఇకపోతే నిన్న పూజ పుట్టిన రోజు సందర్భంగా పలువురు ఆమె అభిమానులు ట్విట్టర్ వేదికగా పలు హ్యాష్ ట్యాగ్స్ తో ఆమెకు వెల్లువలా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది. 

చాలా మంది పూజ ఫ్యాన్స్, ఆమె ఫోటోని తమ కామన్ డిస్ప్లే పిక్చర్ గా పెట్టుకుని మరీ ట్విట్టర్ లో ఆమెకు అభినందనలు హోరెత్తించారు. అంతేకాక పూజ పుట్టినరోజు విషెస్ హ్యాష్ ట్యాగ్స్ చాలాసేపు ట్విట్టర్ లో బాగా ట్రెండ్ అవడం జరిగింది. ఇది గమనించిన పలువురు సినీ విశ్లేషకులు, ఇటీవల కాలంలో ఇంతలా టాలీవుడ్ లో పేరు మరియు ఫ్యాన్స్ ని సంపాదించిన భామ పూజనే అని అంటున్నారు. సో దీన్నిబట్టి పూజ ఆల్మోస్ట్ టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్ అయిపోయినట్లే అని సంబరపడుతున్నారు ఆమె ఫ్యాన్స్. మరి రాబోయే రోజుల్లో ఆమె నటిస్తున్న సినిమాలు ఎంత మేర విజయాన్ని అందుకుని ఆమెకు పేరు తీసుకువస్తాయో చూడాలి......!! 


మరింత సమాచారం తెలుసుకోండి: