టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఇటీవల ప్రభాస్ హీరోగా తెరకెక్కించిన బాహుబలి సిరీస్ లోని రెండు సినిమాలు ఎంతటి విజయాలు అందుకున్నాయో మనకు అందరికీ తెలిసిందే. ఆ సినిమాల అద్భుత విజయాల తరువాత అటు హీరో ప్రభాస్, ఇటు దర్శకుడు రాజమౌళి సహా దాదాపుగా ఆ సినిమాలోని నటీనటులందరికీ కూడా పలు దేశాల్లో కూడా మంచి క్రేజ్ ఏర్పడడం జరిగింది. ఇక ప్రభాస్ మరియు రాజమౌళి పేర్లు విశ్వవ్యాప్తంగా ఎంతో విరివిగా మారుమ్రోగాయి అనే చెప్పాలి. ఇకపోతే ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ల కలయికలో ఆర్ఆర్ఆర్ అనే భారీ మల్టీస్టారర్ ని తెరకెక్కిస్తున్న రాజమౌళి, 

ఆ సినిమాతో కూడా మరొక్కసారి తన స్టామినాని బాక్సాఫీస్ కి రుచి చూపించాలని మంచి కసితో ఆ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం హైదరాబాద్ లో తాజా షెడ్యూల్ జరుపుకుంటున్న ఈ సినిమాకు కొద్దిపాటి బ్రేక్ ని ఇచ్చింది సినిమా యూనిట్. దానికి కారణం ఈనెల అక్టోబర్ 19న లండన్ లోని రాయల్ ఆల్బర్ట్ హాల్ లో రాయల్ ఫిల్హార్మోనిక్ ఆర్కెస్ట్రా ద్వారా బాహుబలి సినిమాని ప్రదర్శించబోతుండడం. ఈ సందర్భంగా బాహుబలి డైరెక్టర్ రాజమౌళి ట్విట్టర్ లో అభిమానులతో తన ఆనందాన్ని పంచుకుంటూ ట్వీట్ కూడా చేసారు. ఇప్పటివరకు ఇంగ్లీష్ మూవీస్ కాకుండా వేరొక భాషా సినిమా ఆ హాల్ లో ప్రదర్శించడం ఇదే తొలిసారి అని ఆయన తన ట్వీట్ లో తెలిపారు. 

ఇక బాహుబలిని ప్రత్యేకంగా చూడడానికి తాను లండన్ వెళ్తున్నానని హీరో ప్రభాస్ కూడా కొద్ది రోజుల క్రితం ఒక వీడియో ద్వారా అభిమానులకు చెప్పడం జరిగింది. ఇక ఈ స్క్రీనింగ్ కి రానా, రాజమౌళి, కీరవాణి వంటివారు లండన్ వెళ్తుండగా వారితో పాటు ఆర్ఆర్ఆర్ మూవీ హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కూడా వెళ్తున్నట్లు సమాచారం. అయితే ఈ విధంగా ఈ ఇద్దరు హీరోలు కూడా లండన్ లోని బాహుబలి స్పెషల్ షోకి హాజరవడం వలన తన ఆర్ఆర్ఆర్ సినిమాకు కొంత మేర పబ్లిసిటీ అవుతుందని భావించిన రాజమౌళి, వారిద్దరినీ లండన్ రమ్మని కోరినట్లు చెప్తున్నారు......!!


మరింత సమాచారం తెలుసుకోండి: