టాలీవుడ్‌ లో ప్రస్తుతం టాప్ పోజిషన్ లో ఉండి ఒక ఊపు ఊపేస్తున్న పూజా హెగ్డే గురించి వస్తున్న ప్రతివార్త సెన్ సేషన్ అవుతోంది. అందుకు కారణం ఇప్పుడు టాలీవుడ్‌లో పూజా టైమ్ నడుస్తోంది గనుక. ఎవరి సినిమా స్టార్ట్ అవుతున్న ముందు హీరోయిన్ గా పూజా నే సంప్రదిస్తున్నారట. ఒకవేళ తను కుదరదంటేనే మిగతా వాళ్ళని ట్రై చేస్తున్నారట. ఇండస్ట్రీకొచ్చి ఎంతకాలమో కాలేదు. అయినప్పటికి ఇప్పుడు టాలీవుడ్‌నే ఏలేస్తోందని అందరు అనుకుంటున్నారు. అంతేకాదు యంగ్ హీరోస్, సీనియర్ హీరోస్ అనే తేడా లేకుండా అందరి హీరోల సరసన నటిస్తూ.. తన నటనతో అందరిని ఆకట్టుకుంటుంది. 

బిజీగా ఉన్నప్పుడే బాగా సంపాదించుకోవాలి.. అవకాశాలు వస్తున్నప్పుడే అందుకోవాలని గట్టిగా డిసైడై పోయింది. అందులో స్టార్ హీరోయిన్‌గా వెలుగుతున్నా కాబట్టి గట్టిగానే రెమ్యునరేషన్ డిమాండ్ చేసి కావాలసినంతగా అంది పుచ్చుకోవాలని పూజా హెగ్డే అనుకుంటుందట. అందుకే సినిమా చేయాలని ఆమెను సంప్రదించిన దర్శకనిర్మాతలు పూజా అడిగిన పారితోషికం చూసి కంగుతిన్నప్పటికీ పరవాలేదనుకొని ఆ తర్వాత మళ్ళీ తననే ఓకే చేసుకుంటున్నారు. 

టాలీవుడ్‌ లో 'ఒక లైలా కోసం' సినిమాతో మొదలైన పూజా ప్రయాణం ఇప్పుడు ప్రభాస్ 'జాన్', స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ 'అల వైకుంఠపురంలో' సినిమాలతో క్షణం తీరిక లేకుండా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే పూజా 'గద్దలకొండ గణేశ్' సినిమాలో నటించడానికి కోటికిపైగా పుచ్చుకుని.. ప్రభాస్‌తో జోడిగా నటించేందుకు ఏకంగా రెండు కోట్లు తీసుకుంటోందని టాక్. అంతేకాదు.. 'అల వైకుంఠపురములో' కోసం రూ. 3 కోట్లు అందుకుంటోందట. ఇలా సినిమా సినిమాకు అరకోటి.. కోటి రూపాయిలు పెంచేస్తుండటంతో దర్శకనిర్మాతలు బెదురుతున్నారట. మరి జాన్, అలవైకుంఠపురంలో హిట్టయిపోతే ఇక పూజా డిమాండ్ మామూలుగా ఉండదేమోనని చెప్పుకుంటున్నారు. పూజా ఇలా డిమాండ్ చేయడానికి బాలీవుడ్ సినిమాలు చేస్తుండటం కూడా ఒక కారణం అని అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: