‘బిగ్ బాస్ 3’ సీజన్ ముగింపు దశకు చేరుకోవడంతో నవంబర్ 3న ఈ సీజన్ విజేతగా ఎవరు వస్తారు అన్న ఆసక్తి విపరీతంగా పెరిగిపోతోంది. ఇలాంటి పరిస్థుతులలో ఈ సీజన్ విజేత శ్రీముఖి అవుతుంది అన్న ప్రచారం జరుగుతోంది. 

దీనికి కారణం శ్రీముఖికి ఉన్న ఇమేజ్ తో పాటు ఇప్పటి వరకు తెలుగులో ‘బిగ్ బాస్’ షోలు మొదలుపెట్టాక విజేతలుగా మగవాళ్ళు వచ్చారు కాని ఇప్పటి వరకు ఒకమహిళ విజేత అవ్వకపోవడం శ్రీముఖి కి కలిసి వచ్చే అంశం అన్న కామెంట్స్ వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో శ్రీముఖి ఆర్మీ పేరుతో ఏర్పడ్డ అభిమానులు ఏకంగా ఆమెకు ఓట్లు వేసి ‘బిగ్ బాస్’ విజేతగా మార్చండి అంటూ ఏకంగా ధియేటర్స్ లో స్లైడ్స్ ప్రకటనలు ఇస్తూ చేస్తున్న హడావిడి హాట్ టాపిక్ గా మారింది.

గతంలో కౌశల్ ఆర్మీ కౌశల్ ను బిగ్ బాస్ విజేతగా మార్చడానికి 5కె రన్ లాంటి కార్యక్రమాలు చేపట్టి ‘బిగ్ బాస్’ షో చరిత్రలో ఎవరికీ రానన్ని ఓట్లు పడేలా చేసి సంచలనాలు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ప్రయత్నాల కోసం లక్షలలో ఖర్చు అయింది అన్న ఆరోపణలు కూడ అప్పట్లో వచ్చాయి. 

దీనితో ఈసారి ‘బగ్ బాస్’ సీజన్ విజేత విషయంలో నిర్ణయం తీసుకోవడానికి ఇలాంటి అనవసరపు పబ్లిసిటీలు ప్రచారాలు లేకుండా నిజమైన గేమ్ ఆడిన వారిని మాత్రమే విజేతగా ప్రకటించాలని ముందుగానే నాగార్జున ఈ షో నిర్వాహకులకు గట్టి సూచనలు ఇచ్చినట్లు టాక్. ఇప్పుడు శ్రీముఖి ఆర్మీ ఇలా రెచ్చిపోయి ఏకంగా ధియేటర్లలో యాడ్స్ వరకు వెళ్ళిపోవడం నాగార్జున దృష్టి వరకు వెళ్ళి అసలు ఏమిజరుగుతోంది అన్న ఎంక్వైరీలు మొదలుపెట్టినట్లు టాక్. శ్రీముఖి ఆర్మీ అత్యుత్సాహం శ్రీముఖికి శాపంగా మారుతుందా అంటూ విమర్శలు వస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: