సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ మంచి సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. గతంలో తమిళ డైరెక్టర్లతో సినిమాలు చేసి చేతులు కాల్చుకున్న మహేష్ బాబు ఇప్పుడు ఎటువంటి తప్పు జరగకుండా స్టోరీలను ఎంచుకునే విషయంలో పక్క క్లారిటీతో ఆచి తూచి అడుగులు వేస్తూ సినిమాలు ఒప్పుకుంటూ ముందుకు దూసుకుపోతున్నారు. దీంతో భరత్ అనే నేను మహర్షి వంటి హిట్లు అందుకున్న మహేష్ తాజాగా 'సరిలేరు నీకెవ్వరు' అనే సినిమా పూర్తి చేసి సంక్రాంతికి మహేష్ ఫ్యాన్స్ కి ఇవ్వడానికి అంతా రెడీ చేసినట్లు వార్తలు వినపడుతున్నాయి. ఈ సినిమాతో ఎలాగైనా హ్యాట్రిక్ హిట్ అందుకోవటానికి మహేష్ శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. కామెడీ నేపథ్యంలో కమర్షియల్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబుతో పాటు సీనియర్ హీరోయిన్ విజయశాంతి కూడా నటిస్తోంది.


రాజకీయాల నుండి మళ్లీ సినిమాల్లోకి మహేష్ బాబు సినిమా తో విజయశాంతి రీ ఎంట్రీ ఇవ్వడం ఈ సినిమాకు అదనపు ప్లస్ అయ్యింది. ఇదే క్రమంలో బండ్ల గణేష్ కూడా రాజకీయాల నుండి మళ్లీ సినిమారంగంలోకి కమెడియన్ గా ఈ సినిమా రీ ఎంట్రీ కాబోతున్నారు. దీంతో ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో అని అభిమానులతో పాటు సినిమా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో మరియు సోషల్ మీడియా చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే ఈ సినిమాని నిర్మిస్తుంది మహేష్ బాబు, దిల్ రాజు మరియు ఏకే ఎంటర్టైన్మెంట్స్ కలసి నిర్మిస్తున్న విషయం అందరికీ తెలిసినదే.


అయితే ఇప్పుడు ఈ ముగ్గురు నైజాం,విశాఖ మరియు గోదావరి జిల్లాలలో తమ సొంత బ్యానర్ ద్వారా ఈ చిత్రాన్ని విడుదల చేసుకుంటున్నారని తెలుస్తుంది.ఈ మూడు చోట్ల మినహా ఇంకా ఈ చిత్రం 70 కోట్లకు పైగా బిజినెస్ చేస్తున్నట్టు సినీ వర్గాల నుంచి సమాచారం.మరి ఈ మిగతా 70 కోట్లు అనేది ఒక్క తెలుగు రాష్ట్రలోనేనా లేక ప్రపంచ వ్యాప్తంగానా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. దీంతో ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో మరియు అభిమానులలో పెద్ద హాట్ టాపిక్ అయింది. జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న ఈ సినిమా మహేష్ అభిమానులకు అంచనాలు చాలానే ఉన్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: