టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. గతంలో భరత్ అనే నేను, మహర్షి సినిమాలతో రెండు వరుస సక్సెస్ లు అందుకున్న సూపర్ స్టార్, ప్రస్తుతం నటిస్తున్న ఈ సినిమాతో మరొక హిట్ కొట్టి, కెరీర్ పరంగా తొలిసారి హ్యాట్రిక్ విజయాలు నమోదు చేయాలని చూస్తున్నారు. లేడీ అమితాబ్ గా పేరుగాంచిన విజయశాంతి ఈ సినిమా ద్వారా టాలీవుడ్ కి నటిగా రీఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా తరువాత మహేష్ బాబు నటించబోయే 27వ సినిమా విషయమై కొద్దిరోజుల నుండి పలు టాలీవుడ్ వర్గాల్లో వార్తలు ప్రచారం అవుతుండగా, 

నేడు అందుతున్న సమాచారం ప్రకారం, ఆయన 27వ సినిమాకు దర్శకుడు ఓకే అయినట్లు చెప్తున్నారు. అతను మరెవరో కాదు, ఇటీవల కెజిఎఫ్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టి దేశవ్యాప్తంగా మంచి పేరు సంపాదించిన ప్రశాంత్ నీల్. ప్రస్తుతం ఆ సినిమాకు సీక్వెల్ గా కెజిఎఫ్ పార్ట్ 2ని తెరకెక్కిస్తున్న ప్రశాంత్, నిన్న మహేష్ బాబు ని కలిసి కథను వినిపించడం జరిగిందని, ఆ కథ మహేష్ కు బాగా నచ్చడంతో, ఆయన కూడా ఓకే చేసినట్లు చెప్తున్నారు. అయితే కొద్దిరోజుల క్రితం ప్రశాంత్, ఎన్టీఆర్ తో ఒక సినిమా చేస్తారని వార్తలు వస్తున్నప్పటికీ, ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీతో చాలా బిజీగా ఉన్న ఎన్టీఆర్, 

వచ్చే ఏడాది ద్వితీయార్ధం తరువాత కానీ అందుబాటులో ఉండరని భావించి, ముందుగా మహేష్ ని అప్రోచ్ అయ్యాడట ప్రశాంత్. ఇక వీరిద్దరి కాంబోలో రాబోతున్న మూవీ పై అతి త్వరలో అధికారిక ప్రకటన కూడా రాబోతున్నట్లు సమాచారం. ఒక వేళ ఈ వార్త కనుక నిజమే అయితే మాత్రం, ఎన్టీఆర్ ని వెనక్కు నెట్టి, ప్రశాంత్ దర్శకత్వంలో నటించే అవకాశాన్ని సూపర్ స్టార్ మహేష్ దక్కించుకున్నట్లే మరి.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: