టాలీవుడ్ సూపర్ స్టార్
మహేష్ బాబు హీరోగా ప్రస్తుతం యువ దర్శకుడు
అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు సినిమా ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుని రాబోయే సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రావడానికి సంసిద్ధం అవుతోంది.
మహేష్ సరసన రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు
దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా,రత్నేవేలు కెమెరా మ్యాన్ గా పనిచేస్తున్నారు. ఇక దీనితో పాటు స్టైలిష్ స్టార్
అల్లు అర్జున్ హీరోగా
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పూజ హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కుతున్న సినిమా అల వైకుంఠుప్రములో.
బన్నీ మరియు త్రివిక్రమ్ ల క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న మూడవ సినిమా కావడంతో ఈ సినిమాపై అందరిలోనూ ఎంతో ఆసక్తి నెలకొని ఉంది. యువ సంగీత దర్శకుడు థమన్ స్వరాలు సమకూరుస్తున్న ఈ సినిమాకు పీఎస్ వినోద్ ఫోటోగ్రఫిని అందిస్తున్నారు. ఇక ఈ సినిమా కూడా సంక్రాంతి కానుకగా జనవరి 12నే రిలీజ్ కాబోతుండడం విశేషం. ఇక ఈ రెండు భారీ సినిమాలతో పాటు, నందమూరి
కళ్యాణ్ రామ్ హీరోగా
ఆదిత్య మ్యూజిక్ అధినేత ఉమేష్ గుప్తా నిర్మాతగా
సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా ఎంత మంచివాడవురా సినిమా కూడా సంక్రాంతి బరిలో నిలుస్తోంది. మరోవైపు విక్టరీ
వెంకటేష్ మరియు నాగచైతన్యల కలయికలో యువ దర్శకుడు బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వెంకీ మామ సినిమా కూడా అదే బరిలో నిలవనుండగా,
అటు
మహేష్ ఇటు బన్నీల సినిమాలు ఒకే రోజున భారీ ఎత్తున రిలీజ్ అవుతుండడంతో, ఎంత మంచివాడవురా మరియు వెంకీ మామ సినిమాల యూనిట్ సభ్యులు తమ రెండు సినిమాలను ఎప్పుడు రిలీజ్ చేయాలో తెలియక కొంత తలలు పట్టుకుంటున్నట్లు టాలీవడ్ వర్గాల టాక్. నిజానికి ఎక్కువగా మహేష్, బన్నీల సినిమాలపైనే మెజారిటీ ప్రేక్షకుల అంచనాలు ఉండడంతో, ఈ సందడిలో సరైన డేట్ లేకుండా కనుక తమ సినిమాలు రిలీజ్ చేస్తే, అవి ఎంతవరకు సక్సెస్ అవుతాయో అర్ధం కానీ పరిస్థితి ఈ రెండు సినిమాల నిర్మాతలకు తలెత్తుతోందట. మరి ఇప్పటికైనా ఆ రెండు సినిమాల నిర్మాతలు తమ సినిమాల రిలీజ్ డేట్లు అనౌన్స్ చేస్తారో లేదో చూడాలి....!!