టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇటీవల రామ్ హీరోగా తెరకెక్కించిన ‘ఇస్మార్ట్ శంకర్’ మంచి విజయం అందుకుంది.  ప్రస్తుతం పూరి తనయుడు ఆకాశ్ పూరితో ‘రొమాంటిక్’ మూవీ షూటింగ్ బిజీలో ఉన్నారు. గతంలో తండ్రీ కొడుకుల కాంబినేషన్ లో మెహబూబా సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే.  ఈ మద్య ‘రొమాంటిక్’ ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది.  దీనికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దాంతో పాటే విమర్శలు కూడా వచ్చాయి. తాజాగా సినిమా కోసం వేసిన స్పెషల్ సెట్ లో డెకరేషన్ క్లాత్స్ కి మంటలు అంటుకోవడంతో కొన్ని నిమిషాల వరకు అందరూ షాకయ్యారు. అయితే ప్రమాదానకి ముఖ్య కారణం చిత్ర నిర్లక్షమే అని తెలుస్తోంది. 

యూనిట్ సభ్యులు మంటలను ఆర్పేందుకు తీవ్రంగా ప్రయత్నించినా కూడా క్లాత్ కావడంతో వేగంగా మంటలు వ్యాపించాయి. షూటింగ్ లో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు హీరో హీరోయిన్లు ఉన్నారా లేదా అనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.  సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ముందస్తు జాగ్రత్తగా ఉండాల్సిన మినిమమ్ సాధనాలను పరికరాలను కూడా అందుబాటులో ఉంచుకోకపోవడం వారి వైఫల్యాన్ని గుర్తు చేస్తోంది. సెట్ లో ఎవరికీ కూడా పెద్దగా ప్రమాదం జరగలేదు.

ఆ మద్య  మధ్య సైరా సినిమా సమయంలో కూడా ఇదే జరిగింది. షూట్ అంతా అయిన తర్వాత ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు రొమాంటిక్ సినిమా సెట్ విషయంలో కూడా ఇదే జరిగిందేమో అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. గతంలో బాలీవుడ్ లో సైతం సంజీయ్ లీలా బన్సాలీ తెరకెక్కించిన ‘పద్మావత్’ మూవీ షూటింగ్ సమయంలో కూడా భారీ ఎత్తున్న అగ్ని ప్రమాదం సంబవించింది. అయి ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ కేతిక శర్మ నటిస్తుంది. పూరీ శిష్యుడు అనిల్ పాదూరి దీనికి దర్శకుడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: