‘హ్యాపీడేస్’ చిత్రంతో మొదటి  పరిచయంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు నిఖిల్ సిద్ధార్థ్. తన హైపర్ యాక్టివ్‌నెస్‌తో ఎంతో మంది అభిమానులను దగ్గించుకున్నాడు.తెలుగు ఇండస్ట్రీలో  హీరోగా తనకంటూ మంచి గుర్తింపును లభించుకున్నారు. ఎప్పుడూ తన సినిమాల గురించే అభిమానులతో ముచ్చటించే నిఖిల్ మెట్ట మొదటిసారి తన లవ్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలను తెలిపారు. తనకు ఓ గర్ల్‌ఫ్రెండ్ ఉందని చెప్పారు. ఈ విషయాన్ని ప్రముఖ నటి మంచు లక్ష్మి హోస్ట్ చేస్తున్న ‘ఫీట్ అప్ విత్ ది స్టార్స్’ షోలో తెలియచేశారు.


నిఖిల్ ఇలా ‘నా జీవితంలో ఓ స్పెషల్ అమ్మాయి ఉంది. ఆమె ఒక మంచి డాక్టర్. తను చాలా మంచిది. నన్ను బాగా అర్థం చేసుకుంటుంది. నేను షూటింగ్‌లో ఉన్నప్పుడు కానీ స్నేహితులతో బయటికి పోయినపుడు  కానీ ఎప్పుడూ డిస్టర్బ్ చేయదు. నాపై అనుమానంతో ఫోన్ కూడా చెక్ చేయడం లాంటివి కూడా అసలు చేయదు. నేను ఫలానా చోటికి వెళ్లాలనుకుంటున్నాను అని తనకు చెప్పినప్పుడల్లా నీ ఇష్టం నీకు నచ్చినట్లుగా ఉండు అని చెప్తుంది. జీవితంలో ప్రతీ ఒక్కరికీ పర్సనల్ స్పేస్ అంటూ ఉండాలి. ఆ విషయం తనకు బాగా తెలుసు. తనలో నాకు నచ్చేది కూడా అదే అని చెప్పారు. ప్రేమలో ఉన్నప్పుడు అమ్మాయి, అబ్బాయి ఒకరికొకరు స్పేస్ ఇచ్చుకోవాలి. ప్రతీ రిలేషన్‌షిప్‌లో ఇది చాలా ముఖ్యం’ అని తెలియచేశారు.


ప్రస్తుతం  మాత్రం వీరిద్దరూ తమ ప్రేమను ఒక ముందు అడుగు ముందుకు తీసుకువెళ్లాలని అనుకుంటున్నారు. ఇటీవల నిఖిల్ ఆ అమ్మాయి తల్లిదండ్రులను కావడం కూడా జరిగింది. పెళ్లి చేసుకుంటామని చెప్పగానే వారూ అంగీకరించారట. నిఖిల్ తల్లిదండ్రులకు కూడా ఆ అమ్మాయి నచ్చిందట. దాంతో త్వరలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అని తెలుస్తోంది. 


ఆయన హీరోగా నటించిన ‘అర్జున్ సురవరం’ సినిమా ఇప్పటికీ విడుదలకు నోచుకోలేదు. మంచి ముహూర్తం కోసం వేచి చూస్తున్నారు. ఎప్పుడు విడుదల చేయాలనుకున్నా ఏదో ఒక సమస్య వచ్చి సినిమా  విడుదల వాయిదా పడుతూనే వస్తుంది. సంతోష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి కథానాయికగా నటించారు. దాంతో ఇక ఈ సినిమాపై నిఖిల్ ఆశలు వదులుకున్నారు అని తెలుస్తుంది. దీని గురించి పట్టించుకోవడం మానేసి చందూ మొండేటితో కలిసి ఇంకో  సినిమాకి సిద్ధం అయ్యారు అని తెలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: