బాహుబలితో ప్రపంచ స్థాయి రికార్డ్ లను కైవసం చేసుకున్న టాల్ స్టార్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. దాదాపుగా రెండుళ్లు టైం తీసుకొని భారీ యాక్షన్ సినిమాలో నటించారు. ఆ సినిమానే సాహో.. ఈ సినిమా భారీ బడ్జెట్తో రూపొందించిన కూడా ప్రేక్షకులకు మాత్రం నచ్చలేదని చెప్పాలి. ఆ సినిమా ఆగస్టు 30 న ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే.. ఫ్యాన్స్ కి నచ్చితే మాత్రం సినిమా హిట్ ఎవ్వడు కదా.. అందరికి నచ్చితేనే సినిమా హిట్ అవుతుంది అని వేరేలా చెప్పనక్కర్లేదు. 


ఇకపోతే ఈ సినిమా మిశ్రమ టాక్ తూ మంచి కలెక్షన్స్ రాబట్టింది. సినిమా పర్వాలేదని టాక్ ని మూట కట్టుకుంది. అయితే, ఆ సినిమాతో ఫ్యాన్స్ మనసును దోచుకోలేని డార్లింగ్ ఇప్పుడు మరో సినిమా లో నటిస్తున్నారు. ఈ సినిమా ఖచ్చితంగా అందరికి నచ్చుతుందని ప్రభాస్ గట్టి నమ్మకంతో ఉన్నాడు. జిల్ ఫెమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు అనే వార్తలు వచ్చాయనే సంగతి తెలిసిందే.. 


ఇప్పుడు ఆ సినిమాను ప్రస్తుతం పట్టాలెక్కించబోతున్నాడని డార్లింగ్ వెల్లడించారు. పీరియాడిక్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఇటలీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 20 శాతానికి పైగా పూర్తయ్యింది. ఇంకొద్ది రోజుల్లోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక ఈ సినిమా కూడా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేసే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నారని అర్థమయింది. 


సినిమా టైటిల్ విషయానికి వస్తే.. జాన్ అనే పేరును ఎంచుకున్నారు. ఈ నెల 23 న ప్రభాస్ పుట్టిన రోజు సందర్బంగా ఆ టైటిల్ అధికారకంగా ప్రకటిస్తామని చిత్ర యూనిట్ వెల్లడించింది. ప్రభాస్‌ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను ప్రభాస్‌ పెదనాన్న కృష్ణం రాజు గోపీ కృష్ణ మూవీస్‌ బ్యానర్‌పై యూవీ క్రియేషన్స్‌తో కలిసి నిర్మిస్తున్నాడు. ఈ సినిమా షూట్ రామోజీ ఫిలిం సిటీలో తెరకెక్కించనున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాదిలో రిలీజ్ చేస్తారని సమాచారం.. 



మరింత సమాచారం తెలుసుకోండి: