ఈ మధ్య కాలంలో సినిమాలను డిజిటల్ ఫ్లాట్ఫామ్ లపై చూడటానికి జనాలు అలవాటు పడుతున్నారు. థియేటర్కు వెళ్లి సినిమా చూడటానికి బదులు ఓక నెల రోజులు ఆగితే ఇంట్లోనే ఫ్యామిలీతో కలిసి చూసేయచ్చు కదా అని చాలా మంది భావిస్తున్నారు ఇప్పుడు. కొన్ని సినిమాలు థియేటర్లలో ఉండగానే డిజిటల్ ఫ్లాట్ఫామ్ లో ప్రత్యక్షం అవుతున్నాయి. మరీ ముఖ్యంగా అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్లు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్లను హెచ్డీ క్వాలిటీతో అందిస్తుండటంతో నెటిజన్లు కూడా డిజిటల్ ఫ్లాట్ఫామ్ వైపు ఆసక్తి బాగా కనబరుస్తున్నారు.
ఆయా సంస్థలు కూడా యూజర్లను ఆకర్షించేలా సబ్స్క్రిప్షన్ ప్లాన్ లను వాటికీ అనుగుణంగా ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విదేశాల్లో ఉండే చాలా మంది సినిమాలు చూసేందుకు డిజిటల్ ఫ్లాట్ఫామ్ లను ఆశ్రయిస్తున్నారు అంట. దీంతో ఓవర్సీస్ లో సినిమాల కలెక్షన్లు భారీగా పడిపోతున్నాయి.
అయితే ఇది ఇలా ఉంటే ఈ నేపథ్యంలో బ్లూస్కై సినిమాస్ కీలక నిర్ణయం తీసుకుంది. స్టైలిష్ స్టార్ అయిన అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుకుతున్న ‘అల... వైకుంఠపురములో’ చిత్రం ఓవర్సీస్ హక్కులు దక్కించుకున్న బ్లూస్కై సినిమాస్ ఆ సినిమాను ఆమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ లో చూడలేరని తెలియచేసింది. అందుకు సంబంధించి ఓ పోస్టర్ను కూడా విడుదల చేసింది. అయితే ఈ చిత్రం థియేటర్లలో ఉన్నన్ని రోజులు డిజిటల్ ఫ్లాట్ఫామ్ లో అందుబాటులో ఉండదని తెలుస్తోంది. ఈ నిర్ణయం ద్వారా ఓవర్సీస్ లో కలెక్షన్లు రాబట్టుకోవచ్చనేది ఆ సంస్థ ఉద్దేశంగా కనపడుతోంది.
అయితే హీరో అల్లు అర్జున్, హీరోయిన్
పూజా హెగ్డే జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మాటల మాంత్రికుడు తివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. సుశాంత్, నివేదా పేతురాజ్, టబు, జయరామ్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు ఈ చిత్రానికి. అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు .