బుల్లితెరపై హాట్ యాంకర్ గా జోరును కొనసాగిస్తున్న యాంకర్ అనసూయ.. ఈటీవీలో జబర్దస్త్ షో లో యాంకర్గా వ్యవహరిస్తోంది. ఆమె యాంకరింగ్ తో పాటుగా సినిమాలలో కూడా నటిస్తుంది. రంగస్థలం వంటి బ్లాక్ బాస్టర్ సినిమాలో రంగమ్మత్త గెటప్ లో అదరగొట్టింది. ఆ తరువాత వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది. అలా ఒక్కో సినిమాలో నటిస్తూ మంచి పేరును పాపులారిటీని సంపాదించుకుంది.
ప్రస్తుతం ఆమె ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమాలో ముఖ్య పాత్ర పోషించారు. సెన్సేషనల్ స్టార్
విజయ్ దేవరకొండ నిర్మిస్తోన్న ఈ సినిమాలో ‘పెళ్ళి చూపులు’ దర్శకుడు
తరుణ్ భాస్కర్ హీరోగా నటించారు. ఆ సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టారు ఆ చిత్ర యూనిట్. ఆ కార్య క్రమంలో అను బేబీ
విజయ్ గురించి ఏమందో వినాలని
విజయ్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అర్జున్ రెడ్డి సినిమాలో విమర్శలు గుప్పించిన ఆమె ఈ సినిమాకు ఎలా చెప్తుందో అని చూడాలి..
ఆ సినిమాలో
విజయ్ దేవరకొండ వాడిన రెండు పదాలు ఏంటంటే.. అసభ్యకరంగా, అభ్యంతరకరంగా ఉందని సోషల్ మీడియా ద్వారా అనసూయ విమర్శించారు.ఎలాంటి డైలాగులు వాడి సామాజానికి ఎం చేస్తున్నావ్ అని అను విమర్శలు మాత్రం బాగానే గుప్పించింది. ఇప్పుడు
విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అనసూయను బాగా ట్రోల్ చేశారు.
గతంలో అర్జున్ రెడ్డి సినిమా కోసం అను బేబీ విమర్శల వర్షం కురిపించిన అనసూయ. ప్రస్తుతం అను
విజయ్ దేవరకొండ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఆమె లీడ్ రోల్ లో నటిస్తుంది. సినిమాలో నటించి ఆయన గురించి ఏం మాట్లాడుతుందో అనే ఆసక్తి నెలకొంది. సినిమా కాబట్టి పొగుడుతుందేమో అని అందరు గుస గుస లాడుతున్నారు. ఈ సినిమాలో ‘మాయ’ ఫేమ్ అవంతికా మిశ్రా హీరోయిన్గా నటించార. కొత్త దర్శకుడు షమీర్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు..