విజయ్ దేవరకొండ కి హీరోగా పెళ్ళి చూపులు మొదటిసినిమా అయినప్పటికి టాలీవుడ్ లో విజయ్ ని స్టార్ చేసిన సినిమా మాత్రం 'అర్జున్ రెడ్డి'. ఈ సినిమా ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 'అర్జున్ రెడ్డి' ఎంత హిట్ అయ్యిందో అంతే విమర్శలను కూడా ఎదుర్కొంది. టాలీవుడ్ లో ఇదోక సంచలనం సృష్టించింది. ఈ సినిమాలో వాడిన బూతు పదాలపై అప్పట్లో చాలా చర్చ జరిగింది. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఈ సినిమాపై జరిపిన చర్చలు ఇక ఏ సినిమా మీద జరగలేదు. అంతేకాదు ఎంతోమంది సినిమాని విపరీతంగా పొగిడారు అంతే తిట్టుకున్నారు. అయితే ట్రైలర్ కే ఇన్ని విమర్శలను ఎదుర్కొన్న'అర్జున్ రెడ్డి' కి రిలీజ్ అయ్యాక విమర్శలు బాగా పెరిగిపోయాయి. ఈ సినిమాను విమర్శించిన వారిలో ముందుగా యాంకర్..నటి అనసూయ ముందు వరసలో ఉంది. 

సోషల్ మీడియా వేదికగా ఆమె అప్పట్లో ఈ సినిమాను మామూలుగా చీల్చి చెండాడలేదు. అంతేకాదు చాలా డిబేట్స్ లో కూడా అనసూయ ఈ సినిమాను దారుణంగా విమర్శించింది. దీంతో అనసూయను కూడా విజయ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. తను చేస్తున్న షోస్ మీద, తన డ్రెసెస్ మీద బోలెడన్ని కామెంట్స్ కూడా చేశారు. అయితే ఇప్పుడు విజయ్ దేవరకొండ తన స్వంత నిర్మాణ సంస్థను స్థాపించి తనకి సోలో హీరోగా మొదటి సక్సెస్ ఇచ్చిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్ మెయిన్ రోల్ గా 'మీకు మాత్రమే చెప్తా' అనే సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఇదే ఇప్పుడు ఒక హాట్ టాపిక్ అయితే ఇక్కడే ఇంకో ఆసక్తికరమైన విషయం ఉంది. 'అర్జున్ రెడ్డి' సినిమా టైం లో తనపైనా సినిమా పైనా దుమ్మెత్తి పోసిన అనసూయ ఈ సినిమాలో లీడ్ రోల్ లో నటించడం. 

విజయ్ ఫ్యాన్స్ తమ హీరోని అంతలా విమర్శించిన అనసూయకు విజయ్ తన సినిమాలో ఎందుకు ఛాన్స్ ఇచ్చాడని రుసరుసలాడుతున్నారు. అంతేకాదు త్వరలో విడుదల కాబోతున్న ఈ సినిమాకి ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో అనసూయ కూడా పాల్గొంటుందని తాజా సమాచారం. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఈ ప్రమోషన్స్ లో అనసూయన పాల్గొంటే తనను ఇంటర్వ్యూ చేసే వాళ్ళు అడిగేది 'అప్పట్లో విజయ్ ని విమర్శించారు కదా.. ఇపుడు అతను ప్రొడ్యూస్ చేస్తున్న సినిమాలో ఎందుకు నటించారు' అని. మరి ఇందుకు అనసూయ ఏం చెప్తుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: