తెలుగు సినీ పరిశ్రమలో మెగా ఫ్యామిలీ నుంచి ఎంతో మంది హీరోలు తమ సత్తా చాటుతున్న విషయం తెలిసిందే.  మెగాస్టార్ తర్వాత పవన్ కళ్యాన్ ఆ రేంజ్ మాస్ ఫాలోయింగ్ సంపాదించాడు. తర్వాత అల్లు అర్జున్, రామ్ చరణ్ లు మాస్ ఫాలోయింగ్ సంపాదించారు.  వీరిద్దరి తర్వాత పిల్లా నువ్వులేని జీవితం సినిమాతో మెగాస్టార్ మేనళ్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా వెండి తెరకు పరిచయం అయ్యాడు. 

ఆ తర్వాత మెగాబ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ‘ముకుంద’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు.  ఇక సాయిధరమ్ తేజ్ ‘పిల్లా నువ్వులేని జీవితం’ తర్వాత సుబ్రమణ్యంఫర్ సేల్, సుప్రీమ్ మంచి విజయాలు అందుకున్నాడు.  ఆ తర్వాత వరుస ఫ్లాపులతో సతమతమయ్యాడు. ఆ మద్య ‘చిత్రలహరి’ కాస్త పరవాలేదు అనిపించింది. ప్రస్తుతం గీతా ఆర్ట్స్ 2, యువి క్రియేషన్స్ బ్యానర్స్ పై బన్నీవాసు నిర్మిస్తున్న చిత్రం ‘ప్రతిరోజూ పండగే’ లో నటిస్తున్నాడు. అప్పట్లో సుప్రీమ్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న జోడి రాశీఖన్నా, సాయిధరమ్ తేజ్ మరోసారి కలిసి నటిస్తున్నారు.  తేజు పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ టీజర్ ని రిలీజ్ చేసింది.


40 సెకండ్ల టీజర్ లో ఎలాంటి డైలాగులు లేనప్పటికీ ఈ మూవీ ఎంత కలర్ ఫుల్ గా, ఎంటర్టైనింగ్ గా ఉండబోతోందో చూపించారు. తేజు, రాశి ఖన్నా మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరినట్లు ఉంది. ఒక గ్రామంలో నిండు కుటుంబం ఎలా ఉండబోతుంతో వారి మద్య అనుబంధాలు ఎలా ఉంటాయో ఈ మూవీలో చూపిస్తున్నట్లుంది. ఫ్యామిలీ తరహా సినిమాలకు టాలీవుడ్ లో ఎప్పుడూ ఆదరణ ఉంటుంది..మరి ఈ సెంటిమెంట్ తో సాయిధరమ్ తేజ్ హిట్ అందుకుంటాడా అన్న విషయం  ‘ప్రతిరోజూ పండగే’ రిలీజ్ తర్వాత తెలుస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: