బాలీవుడ్ దర్శక, నిర్మాతలే కాదు హీరోలు కూడా ఇప్పుడు దక్షిణాది వైపు చూస్తున్నారు. భారీ సినిమాల కోసం, మంచి కథల కోసం బాలీవుడ్ స్టార్ హీరోలు, నిర్మాతలు సౌత్ లో ఉన్న వాళ్ళ కోసం చూస్తుండటం విశేషం. ఇలాంటి క్రమంలో మరో సౌత్ ఇండియన్ దర్శకుడికి బాలీవుడ్ లో పెద్ద ఆఫర్ దక్కడం హాట్ టాపిక్ గా మారింది. రీసెంట్‌గా 'అర్జున్ రెడ్డి' దర్శకుడు సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్ లో షాహిద్ కపూర్-కియారా అద్వానీ జంటగా కబీర్ సింగ్ ని తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు. ఈ నేపథ్యంలోనే మరో సౌత్ ఇండియన్ దర్శకుడు బాలీవుడ్ లో సినిమాను రూపొందించబోతున్నాడట. అతడే తమిళ దర్శకుడు అట్లీ. 

ఇదివరకు 'రాజా రాణి'తో సహా విజయ్ తో పలు సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించి హిట్ అందుకున్నాడు అట్లీ. అంతేకాదు కోలీవుడ్ లో ఈ యంగ్ డైరెక్టర్ కి మంచి క్రేజ్ ఉంది. సూపర్ స్టార్ రజనీకాంత్ లాంటి వాళ్ళు కూడా అట్లీ తో జత కట్టడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. ఇక ప్రస్తుతం విజయ్ తో ఒక సినిమాను రెడీ తెరకెక్కించాడు. 'బిజిల్' పేరుతో ఆ సినిమా దీపావళికి విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. 

ఇక ఇటీవల సమ్మర్ లో ఐపీఎల్ మ్యాచ్ కోసం చెన్నై వచ్చినప్పుడు బాలీవుడ్ బాద్ షా కేకేఆర్ ఓనర్ షారూక్ ఖాన్ అట్లీని కలిశాడట. అట్లీ ఆఫీస్ కు కూడా వెళ్ళీ స్టోరీ డిస్కస్ చేశారట. దాదాపుగా ప్రాజెక్ట్ కన్‌ఫర్మ్ అయినట్టుగా అటు బాలీవుడ్ ఇటు కోలీవుడ్ నుంచి సమాచారం అందుతోంది. అసలే షారూక్ వరస ఫ్లాప్స్ లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో తన నెక్స్ట్ సినిమాతో హిట్ కొడితే తప్ప స్టార్ డమ్ ని మార్కెట్ ని నిలబెట్టుకోవడం కష్టం. షారూక్, అట్లీ సినిమాను బాలీవుడ్ బిగ్ ప్రొడ్యూసర్ కరణ్ జొహార్ రూపొందించనున్నట్టుగా లేటెస్ట్ న్యూస్. ఇదే గనక జరిగితే మరికొంతమంది మన సౌత్ డైరెక్టర్, రైటర్ బాలీవుడ్ లో సక్సస్ కొట్టి సెటిల్ అవడం ఖాయం. 



మరింత సమాచారం తెలుసుకోండి: