బాహుబలి సినిమాతో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కెరీర్ ను ఓ మలుపు తిప్పిందని చెప్పాలి. నరసింహ లో నీలాంబరి పాత్ర తర్వాత మళ్ళీ అంతకంటే పవర్ ఫుల్ రోల్ పోషించిన రమ్యకృష్ణ కోసం ఇప్పుడు ప్రత్యేకమైన పాత్రలు ఆమె కోసం వెదుక్కుంటూ వస్తున్నాయి. సోగ్గాడే చిన్నినాయనా, శైలజరెడ్డి అల్లుడులో చాలా విభిన్నమైన పాత్రలు పోషించిన రమ్యకృష్ణ ఇప్పటికే బంగార్రాజు సినిమాలో మళ్ళీ నటించబోతున్నారు. ఇక లేటెస్ట్ గా మరో సినిమాలో ఓ పాత్రకు రమ్యకృష్ణ ఓకె చెప్పారు. పూరి జగన్నాధ్.. తన కొడుకు ఆకాష్ తో నిర్మిస్తున్న 'రొమాంటిక్' సినిమాలో రమ్యకృష్ణ ఓ ఫుల్ లెంగ్త్ స్పెషల్ రోల్ చేయబోతున్నారు. ఈ సినిమాకు కథ మాటలు మాత్రమే పూరి జగన్నాధ్ అందిస్తున్నారు. 

దర్శకత్వం మాత్రం అనిల్ అనే కొత్త దర్శకుడికి అప్పగించారు. ఎప్పటిలాగే తన సొంత నిర్మాణ సంస్థలు పూరి కనెక్ట్స్, పూరి జగన్నాధ్ టూరింగ్ టాకీస్ బ్యానర్స్ పై పూరి-ఛార్మీ కలిసి  నిర్మిస్తున్నారు. కేతిక శర్మ అనే కొత్త అమ్మాయి ఈ సినిమాలో హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయమవుతోంది. పూరి స్టైల్లో రిలీజ్ చేసిన ఫస్ట్ లూక్ పోస్టర్స్ తో కేతిక ఇప్పటికే ఇండస్ట్రీని ఆకర్షించింది. ఇక ఈ సినిమాను సమ్మర్ కి కాస్త ముందుగా విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తూ ఆ దిశగా శరవేగంగా సినిమాను కంప్లీట్ చేస్తున్నారు. 

రమ్యకృష్ణ భర్త, క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో నటించబోతోందని తాజా సమాచారం. వాస్తవంగా చెప్పాలంటే కృష్ణవంశీ 2004లో నితిన్, ఛార్మి, అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కించిన 'శ్రీ ఆంజనేయం' సినిమాలో రమ్యకృష్ణ నటించారు. ఆ తర్వాత తన భర్త తీసిన ఏ సినిమాలోనూ రమ్యకృష్ణ నటించలేదు. అయితే ఇంతకముందు కొన్ని ఇంటర్ వ్యూస్ లో కృష్ణవంశీ.. రమ్యకృష్ణ తన డైరెక్షన్ లో చేయడానికి ఇంట్రస్ట్ చూపించదని సరదాగా మాట్లాడారు. ఇక కృష్ణవంశీ నెక్స్ట్ తెరకెక్కించబోతున్న సినిమాలో రమ్యకృష్ణ ఒక పవర్ ఫుల్ క్యారక్టర్ చేస్తున్నట్టు లేటెస్ట్ న్యూస్. మరి ఈసారైనా కృష్ణవంశీ హిట్ కొట్టి తను క్రియేటివ్ డైరెక్టర్ అన్న పేరు నిలబెట్టుకుంటాడో లేదో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: