లేడీ సూపర్ స్టార్ నయనతారది విభిన్నమైన స్టైల్. తెలుగు, తమిళం భాషలలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన ఆమెకు అంటూ ఓ ప్రత్యేక వ్యక్తిత్వంతో కూడా గుర్తింపు లభించింది. మొదట మళయాళ సినిమాలో నటించి సినిమా రంగంలోకి ప్రవేశించిన నయనతార.. ఆ తరువాత తెలుగు, తమిళంలో అగ్రహీరోలందరితో  నటించడం జరిగింది. అయితే ఆమె మొదటి నుంచి ఏ సినిమా ప్రమోషన్స్‌ కి రాదు. 


ఆ విషయం సినిమా ప్రారంభానికి ముందే ఆమె చెప్తారు. ఆ విషయం అందరికీ తెలిసిందే. ఎంతటి టాప్ హీరో సినిమా అయినా సరే ఆమె తొలి నుంచి అదే పద్దతిని ఫాలో అవుతుంది అని అందరికి తెలుసు.సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం తమ విధిగా భావిస్తారు ముఖ్యమైన హీరోయిన్లు. అతికొద్ది  హీరోయిన్లు మంది మాత్రమే వాటికి చాల దూరంగా ఉంటారు.


ఐతే నయనతార దక్షిణాదిలోనే అత్యధిక పారితోషకం తీసుకుంటున్న హీరోయిన్‌గా రికార్డు సాధించింది. కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకున్నా.. తీరా ఆ సినిమా ప్రమోషన్స్‌కు మాత్రం హాజరు కాదని అనేకమంది ఆమెపై అభియోగాలు చేస్తూ ఉంటారు. ఈ విషయంలో నయన్.. స్టార్ హీరోలను అసలు పట్టించుకోదు. తాజాగా చిరంజీవి హీరోగా నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా ప్రమోషన్స్‌లో నయనతార ఎక్కడ కూడా కనపడలేదు అని అందరికి తెలుసు. తాజాగా నయన్..తాను ఎందుకు ప్రమోషన్స్‌కు రాననే విషయమై ఒక మీడియాకు ఇంటర్వ్యూలో తెలిపి అందరినీ ఆశ్యర్యపరిచింది.


ఈ సందర్భంగా నయనతార మాట్లాడుతూ.. పదేళ్ల నుంచి తాను నటించిన సినిమాలకు సంబంధించిన ఏ ప్రచార కార్యక్రమంలోనూ తాను పాల్గొన లేదు అని . . పదేళ్ల తర్వాత తాను మీడియాతో ముచ్చటించానని తెలిపింది. ఇంకా ఆమె మాట్లాడుతూ నేను వ్యక్తిగతంగా గోప్యత పాటిస్తాను అని తెలిపారు. నేనేం ఆలోచిస్తున్నానో ప్రపంచానికి తెలియాల్సిన అవసరం లేదు అని అన్నారు. జన సమూహాల్లోకి వెళ్లడం నాకు చాల ఇబ్బందిగా ఉంటుంది. గతంలో నా వ్యక్తిగత జీవితం గురించి అనేక పుకార్లను కూడా ప్రచారం చేయడం జరిగింది. అలాంటి ఒత్తిళ్లను నేను తట్టుకోలేను నా వాళ్ళ కాదు అని తెలిపింది నాయన తార. అందుకే మీడియాకు దూరంగా ఉంటున్నా. నటించడం నా వృత్తి. నా సినిమాలే నేనేమిటో తెలియచెబుతాయి అని తెలియచేసారు.


మరింత సమాచారం తెలుసుకోండి: