తెలుగులో వస్తున్న ది బెస్ట్ కామెడీ షో  ఏదంటే.. వెంటనే చెబుతారు జబర్ధస్త్. ఆరేళ్ల క్రితం మొదలైన ఈ కామెడీ షో ఇంకా తన రేటింగ్ కొనసాగిస్తూనే ఉంది.  జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్ధస్త్ కామెడీ షో ద్వారా ఎంతో మంది నటులు బుల్లితెరకు పరిచయం అయ్యారు.  వారిలో చాలా మంది ఇప్పుడు వెండితెరపై తమ సత్తా చాటుతున్నారు.  జబర్ధస్త్ అనగానే వెంటనే గుర్తుకు వచ్చేది సుడిగాలి సుధీర్ అండ్ గ్రూప్.  సుడిగాలి సుధీర్, గెటప్ శీను, ఆటో రాంప్రసాద్..వీరి ముగ్గురు కామెడీ చూస్తుంటే కడుపుబ్బా నవ్వుకోవాల్సిందే.


ముఖ్యంగా ప్రతి స్కిట్ లో వెరైటీ గెటప్స్ తో శీను, ఆటో పంచ్ లతో రాంప్రసాద్, ప్లే బాయ్ గా సుడిగాలి సుధీర్ ఇలా ఎవరికి వారే తమ పర్ఫామెన్స్ తో అదరగొడుతుంటారు. తాజాగా  ఈ ముగ్గురు హీరోలుగా బిగ్ స్క్రీన్ పై “త్రీ మంకీస్” చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నారు. కారుణ్య చౌదరి హీరోయిన్ గా నటించింది. ఓరుగల్లు సినీ క్రియేషన్స్ పతాకంపై అనిల్ కుమార్ జి.దర్శకత్వంలో నగేష్ జి. నిర్మించిన ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలను పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్కును జరుపుకుంటుంది.


తాజాగా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయ్యింది.  ఇక ట్రైలర్ లో సుడిగాలి సుధీర్, గెటప్ శీను, రాంప్రసాద్ కామెడీతో పాటు షకలక శంకర్ కామెడీ కూడా అదిరిపోయింది.  ఇక కారుణ్య చౌదరి మొదట సాఫ్ట్ గా ఉన్న తర్వాగ ఈ ముగ్గురుని భయపెట్టే సీన్ చూస్తుంటే సినిమాలో కామెడీ తో పాటు థ్రిల్లింగ్ కూడా బాగానే ఉన్నట్లు కనిపిస్తుంది. ఇక ట్రైలర్ లో పేరు చెప్పలేదు..అనగానే సన్నీలియోన్ అంటుంది..అప్పుడు రాంప్రసాద్ సన్నీలియోన్ ని యాభై వేలకు తీసుకు వచ్చారా అనే ఆటో పంచ్..మొత్తానికి సినిమా ఫుల్ లెన్త్ కామెడీగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ మూవీ ముగ్గురు కమెడియన్లకు అదృష్టాన్ని పండిస్తుందా లేదా చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: