సెకండ్ ఇన్నీంగ్స్లో కూడా రమ్యకష్ణ యాక్టింగ్లో ఏ మాత్రం పవర్ తగ్గడం లేదు. బాహుబలితో శివగామిగా అందరి మనస్సులో నిలిచిపోయింది రమ్య. ఇప్పుడు ప్రత్యేకమైన పాత్రలు ఆమె కోసం వెదుక్కుంటూ వస్తున్నాయి. సోగ్గాడే చిన్నినాయనా, శైలజరెడ్డి అల్లుడులో వైవిధ్యమైన పాత్రలో చేసిన రమ్యకృష్ణ ఇప్పటికే బంగార్రాజు సినిమాలో మళ్లీ కనిపించబోతున్నారు. ఇప్పుడు మరో సినిమాలో కీలక పాత్రలో ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. ఇస్మార్ట్
శంకర్ లాంటి బ్లాక్బస్టర్ హిట్ తర్వాత పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్ రొమాంటిక్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
పూరి సొంత బ్యానర్లో ఆయన కుమారుడు ఆకాశ్ హీరోగా తీస్తున్నఈ చిత్రలో రమ్యకృష్ణ కూడా నటిస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి.
అనిల్ పాడూరి అనే కొత్త యువకుడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు హైలెట్గా నిలిచే సన్నివేశాల చిత్రీకరణ జరుగుతున్నట్టు సమాచారం. ఈ సినిమాలో సీనియర్ నటి రమ్యకృష్ణ ఓ కీలక పాత్రలో నటించనున్నారని ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సినిమా అంతా రమ్యకృష్ణ కనిపిస్తారనీ, ఆమె పాత్రను పూరి గొప్పగా డిజైన్ చేశాడని చెప్పుకుంటున్నారు.
రమ్యకృష్ణ కెరియర్లో చెప్పుకోదగిన పాత్రగా ఈ సినిమా రోల్ కూడా ఉంటుందంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.రమ్య
కృష్ణ అక్టోబర్ 16 నుండి షూటింగులో జాయిన్ అవుతున్నారని మూవీ టీమ్ తెలిపింది. ఈ చిత్రానికి సునల్ కశ్యప్ సంగీతం అందిస్తుండగా,
నరేష్ సినిమాటోగ్రఫర్గా వ్యవహరిస్తున్నారు.కథ - మాటలు పూరి అందించారు.ఈ సినిమాను పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరీ కనెక్ట్స్ సంయుక్తంగా రూపొందిస్తున్నాయి.
ఇటీవల రిలీజైన ఫస్ట్లుక్కు మంచి స్పందన లభించింది. మందిరా బేడి, మకరంద్ దేశ్ పాండే ఇతర పాత్రల్లో నటిస్తున్నఈ సినిమాఇప్పటికి కొంతవరకూ షూటింగు జరుపుకుంది. ఈ సినిమా ద్వారా తెలుగు తెరకి కేతిక శర్మ అనే కొత్త అమ్మాయి హీరోయిన్గా పరిచయమవుతోంది.