పెళ్ళి చూపులు సినిమాతో హీరోగా పరిచయమైన విజయ్ దేవరకొండ ఆ తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డితో స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. అర్జున్ రెడ్డి సినిమాతో యూత్ లో అతనికి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగింది. అయితే విజయ్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. సినిమల్లో హీరోగా నటించడమే నిర్మాతగా మారి సినిమాలు తీసేందుకు రెడీ అయ్యాడు విజయ్. కింగ్ ఆఫ్ హిల్ ప్రొడక్షన్ పేరుతో తన బ్యానర్ ని స్టార్త్ చేసిన విజయ్ "మీకు మాత్రమే చెప్తా" అనే సినిమాతో మన ముందుకు వస్తున్నాడు.


తన మొదతి సినిమా దర్శకుడు తరుణ్ భాస్కర్ హీరోగా రూపొందిందీ చిత్రం. నూతన దర్శకుడు షమ్మీర్ సుల్తాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఇప్పటీకే విడుదలైన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ రోజు తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ని విడుదల చేసారు. పెళ్ళి చూపులు మాదిరిగానే ఈ చిత్రంలో యూత్ ని ఆకట్టుకునే అంశాలు చాలానే ఉన్నాయని ట్రైలర్ ని చూస్తే అర్థం అవుతుంది. మంచి కామెడీ తో ఫ్యామిలీ ఆడియన్స్ చూసేలా రూపొందించారని తెలుస్తుంది.


మన సీక్రెట్స్ అన్నీ మన సెల్ ఫోన్ లో దాచబడతాయి. ఆ సీక్రెట్స్ ఎవరికైనా తెలిసిపోతుందేమో అన్న భయంతో వణికిపోతూ తరుణ్ కనిపించాడు. ఫలక్ నుమా దాస్ సినిమాలో తనలోని నటుడిని బయటకు తీసుకువచ్చిన తరుణ్, హీరోగా మెప్పిస్తాడో లేదో చూడాలి. ఈ సినిమా ఆద్యంతం నవ్వులు పంచే విధంగా ఉంటుందని సమాచారం. ఈ సినిమాలో తరుణ్ తో పాటు యాంకర్ అనసూయ, ఈ నగరానికి ఏమైంది ఫేమ్ అభినవ్ గొమటం నటిస్తున్నారు. విజయ్ దేవరకొండ హీరో అవ్వక ముందు పడ్డ కష్టాలను దృష్టిలో పెట్టుకుని కొత్త వాళ్లని ప్రోత్సహించడానికి తన నిర్మాణంలో మరిన్ని సినిమాలు తీస్తాడట.


మరింత సమాచారం తెలుసుకోండి: