విజయ్ దేవరకొండ-సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో వచ్చిన సెన్ సెషనల్ హిట్ అర్జున్ రెడ్డితో సూపర్ హిట్ అందుకున్న హీరోయిన్
షాలిని పాండే. మొదటి సినిమాతోనే బోల్డ్ గా నటించి ఇండస్ట్రీలో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా తర్వాత షాలినీ కి యంగ్ హీరోల సరసన వరుసగా అవకాశాలు క్యూ కడతాయనుకుంటు అది కాస్త ఎందుకనో రివర్స్ అయింది. అనుకున్నంత స్పీడ్ గా
షాలిని కెరీర్ సాగలేదు. అయితే ఇప్పుడిప్పుడే మెల్లగా సినిమాలు చేస్తూ బిజీ అవుతోంది. ఇక అర్జున్ రెడ్డి సినిమా తరువాత టాలీవుడ్లో
కళ్యాణ్ రామ్ తో 118 సినిమా చేసింది. ఈ సినిమాలో కూడా పరవాలేదు అనిపించుకుంది. ఇక ప్రస్తుతం తెలుగులో
రాజ్ తరుణ్ హీరోగా 'ఇద్దరి లోకం ఒకటే' సినిమాలో
షాలిని నటిస్తుంది. అలానే అనుష్కతో నిశ్శబ్ధం తో పాటు తమిళంలో రెండుమూడు సినిమాలు కమిటయిన
షాలిని కి బాలీవుడ్ నుండి ఆఫర్స్ రాగానే వెంటనే ముంబై కి మకాం మార్చేసింది.
ఇక్కడ సినిమాలకి డేట్స్ ఇచ్చి, షూటింగ్ కంప్లీట్ చేయకుండానే ముంబయికి మకాం మార్చడమేంటని నిర్మాతలు ఈ అమ్మడు మీద ఫైర్ అవుతున్నారు.
షాలిని మేనేజర్ని కాంటాక్ట్ చేస్తే ఆ మేనేజర్కే
షాలిని అందుబాటులో లేదని తెలుస్తుంది. అంతేకాదు మేనేజర్ని కూడా మార్చేసిందని, ముంబై లో కొత్త పీఆర్ ఏజెన్సీని ఏర్పాటు చేసుకుందని తాజా సమాచారం. దీంతో షాలినికి వచ్చిన ఆ హిందీ అవకాశాన్ని క్యాన్సిల్ చేయించైనా సరే ముందు తను ఇక్కడ కమిటయిన సినిమాలు పూర్తి చేయించాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారని లేటేస్ట్ న్యూస్. ఒకవేల తన ప్రవర్తనలో మార్పు రాకపోతే
షాలిని పై నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేసి అవసరమయితే నష్ట పరిహారం చెల్లించాలని కూడా పట్టుదలతో ఉన్నారట.
మరి ఇప్పటివరకు అర్జున్ రెడ్డి తప్ప షాలినీకి చెప్పుకోదగ్గ సూపర్ హిట్ సినిమాలు లేవు. స్టార్ హీరోయిన్ అన్న పేరు కూడా ఇంకా రాలేదు. నాలుగు సినిమాలకి సైన్ చేసేస్తే పెద్ద హీరోయిన్ లా బిహేవ్ చేస్తుందా అన్న కామెంట్స్ వస్తున్నాయి. విషయం పీక్స్ లోకి వెళ్ళకముందే
షాలిని సమస్యను సున్నితంగా పరిష్కరించుకుంటే తన కెరీర్ కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. లేదంటే కష్టమేనని చెప్పుకుంటున్నారు.