టాలీవుడ్ లో ప్రస్తుతం హవా కొనసాగిస్తున్న హీరోయిన్లలో పూజా హెగ్డే, రష్మీక మందనా ఉన్నారు. వరుస హిట్లతో భారీ ఆఫర్లతో కెరీర్ కొనసాగిస్తున్నారు. రష్మిక కంటే పూజాకు సినిమాలెక్కువగా ఉన్నాయి. హిట్లలో రష్మికకు భారీ హిట్లు ఉన్నాయి. ప్రస్తుతం పూజా, రష్మిక మధ్యే టాలీవుడ్ లో పోటీ నడుస్తోంది.

 

 

పూజాకు హిట్స్ ఉన్నాయి.. క్రేజీ ఆఫర్లు ఉన్నాయి. డీజే తర్వాత ఎన్టీఆర్ తో ఛాన్స్ కొట్టేసింది. బాలీవుడ్ మూవీస్ చేసింది. ఇప్పుడు అల్లు అర్జున్ తో చేస్తోంది. తర్వాత ప్రభాస్ తో జాన్, అఖిల్ మూవీస్ లైన్ లో ఉన్నాయి. మధ్యలో బాలీవుడ్ అవకాశం వస్తే డేట్స్ అడ్జస్ట్ చేస్తూంటుంది. దీంతో ఆమె బిజీ బిజీగా ఉంటోంది. ఇక టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ రష్మిక ఛలో హిట్, గీత గోవిందం వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఉన్నాయి. ఇప్పటికీ ఈ ఫేమ్ అమ్మడికి బాగా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం మహేశ్ తో, తర్వాత అల్లు అర్జున్ తో సినిమాలు కమిట్ అయి తెలుగులో టాప్ పొజిషన్ కి దారి వేస్తోంది. మధ్యలో తమిళ సినిమాలు కూడా చేస్తూ బిజీగా వుంది. ప్రస్తుతం టాలీవుడ్ ని వీళ్ళిద్దరూ ఏలుతున్నారు. రాశీ ఖన్నా, రెజీనా వంటి వారు స్లో అయిపోయారు. పూజాకు హిట్స్ ఉన్నాయి కానీ సరైన బ్లాక్ బస్టర్ లేదు. రష్మిక కు బ్లాక్ బస్టర్, హిట్, ఎవరేజ్ ఫ్లాప్ ఉన్నా కానీ నిర్మాతలు క్యూ కడుతున్నారు.

 

హిట్స్ మీద ఆధారపడే ఇండస్ట్రీలో ఆ ట్రాక్ చాలా అవసరం. ఇద్దరూ తమ అందం, నటనతో అవకాశాలు పట్టేస్తున్నారు. రష్మిక ఎన్నో ఆశలు పెట్టుకున్న డియర్ కామ్రేడ్ ఫ్లాప్ అయినా అవకాశాలు తగ్గలేదు. పూజాకు క్రేజ్ తో ఆఫర్లు పట్టేస్తోంది.  ప్రస్తుత స్పీడ్ లో టాప్ పొజిషన్లో వీరిద్దరిలో ఎవరుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: