బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్ల ఫ్యామిలో మెంబర్స్ ఒక్కొక్కరుగా వస్తున్నారు. బుధవారం వరకు నలుగురు కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులు బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చారు. అయితే ఈ నలుగురిలో అందరికంటే ఎక్కువ ఆకర్షించింది బాబా భాస్కర్ ఫ్యామిలీనే. ఇప్పటి వరకు ఎవరి ఫ్యామిలో మెంబర్స్ వచ్చినా కేవలం ఒకరు మాత్రమే వచ్చారు కానీ బాబా భాస్కర్ విషయంలో మాత్రం ఇద్దరు పిల్లలతో పాటు ఆయన భార్య కూడా వచ్చింది. ముందు ఇద్దరు పిల్లలని లోనికి తీసుకువచ్చిన బిగ్ బాస్ కొద్ది సేపయ్యాక సర్ ప్రైజ్ గా బాబా గారి భార్యనికూడా లోనికి తీసుకువచ్చాడు.

ఫ్యామిలీ మొత్తం రావడంతో బాబా చాలా హ్యపీగా ఫీల్ అయ్యారు. బాబా భాస్కర్ హౌస్ లో ఏడ్చిన సందర్భాలు కొన్ని చూశాం. అయితే అలా ఎందుకు ఏడుస్తున్నావని ఆయన ఇద్దరు పిల్లలు అడిగారు.  దానికి ఆయన చెప్పిన సమాధానం ప్రేక్షకులని కదిలించింది. నన్ను అందరూ గేమ్ ఆడుతున్నారని, మాస్క్ వేసుకున్నాడని అంటుంటే, తట్టుకోలేక ఏడుపొచ్చింది అని చెప్తాడు. నేను ఇంట్లో ఎలా ఉన్నానో ఇక్కడ కూడా అలానే ఉంటున్నాను. కానీ అందరూ గేమ్ ఆడుతున్నావని అంటున్నారని అన్నాడు. బాబా భాస్కర్ మాటలకి ఆయన అభిమానులు ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు.


అయితే మరో విషయం, బాబా భాస్కర్ తన పిల్లలతో కూడా సెటైర్లు వేసాడు. దీన్ని బట్టి అతను గేమ్ లోనే కాదు బయట కూడా సరదాగానే ఉంటాడని, బయట కూడా బాబా ప్రవర్తన అలాగే ఉందని అర్థం అవుతుంది. దీంతో ఇప్పటి వరకు బాబా మాస్క్ వేసుకుని ఆడుతున్నాడని అనుకుంటున్న వారందరికీ ఫ్యామిలో మెంబర్స్ తో  ఆయన ప్రవర్తన ద్వారా తనకి మాస్క్ లేదని తెలిసేలా చేశాడు. ఈ విషయంలో బాబా భాస్కర్ అభిమానులు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మొత్తానికి ఇప్పటి వరకు జరిగిన ఫ్యామిలీ ఎపిసోడ్ లో బాబా భాస్కర్ దే హైలైట్ గా నిలిచింది.



మరింత సమాచారం తెలుసుకోండి: