అప్పుడెప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం ఇండస్ట్రీలో ఓ హీరోయిన్ విషయంలో బాలయ్యకు రవితేజకు మధ్య గ్యాప్ వచ్చిందన్న ప్రచారం అయితే ఉంది. ఇందులో నిజానిజాలు ఏంటన్నది పూర్తిగా తెలియకపోయినా ఆ ఇష్యూ తర్వాత
రవితేజ పదే పదే బాలయ్య సినిమాలకు పోటీగా రిలీజ్ చేసి పైచేయి సాధించాడు. ఆ తర్వాత వీరిద్దరి మధ్య ఇష్యూ కాస్త సైలెంట్ అయ్యింది.
ఇక ఇప్పుడు మళ్లీ చాలా యేళ్ల తర్వాత మళ్లీ బాలయ్య వర్సెస్ రవితేజ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్నాయి. ఇప్పటికే సంక్రాంతి సినిమాలు డిసైడైన తరుణంలో బాలయ్య, రవితేజా
క్రిస్మస్ పండుగను టార్గెట్ చేశారు. సంక్రాంతికి ఒకే రోజున బన్నీ అల వైకుంఠపురంలో, మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు వస్తున్నాయి. ఒక వెంకీ మామ సైతం పండగకే అంటున్నారు. రజనీకాంత్ దర్బార్ సైతం సంక్రాంతి రేసులోనే ఉంది.
ఇక క్రిస్మస్ విషయానికి వస్తే బాలయ్య కె ఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రూలర్, మాస్ మహారాజా వి ఐ
ఆనంద్ దర్శకత్వంలో నటిస్తున్న డిస్కో
రాజా చిత్రాలు డిసెంబర్ 20న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించేశారు. ఈ ఇద్దరి పోటీ ఇలా ఉందనుకుంటే అదే రోజు మెగా హీరో కూడా రంగంలోకి దిగుతున్నాడు.
సాయి ధరమ్ తేజ్ - మారుతీ దర్శకత్వంలో చేస్తున్న ప్రతిరోజు పండుగే చిత్రాన్ని కూడా అదే రోజు విడుదల చేస్తున్నారు.
ఈ సినిమా రిలీజ్ డేట్పై కూడా అధికారికంగా ప్రకటన వచ్చేసింది. ఫస్ట్ గ్లిమ్ప్స్ పేరుతో విడుదలైన ప్రతిరోజు పండుగే మూవీ ప్రమోషనల్ వీడియో ఆహ్లాదంగా ఉంది. యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. రాశీ ఖన్నా హీరోయిన్. మరి ఈ ట్రయాంగిల్ ఫైట్లో ఎవరైనా వెనక్కి తగ్గుతారా ? లేదా ? లేదా ముగ్గురు పోటీ పడితే ఎవరు గెలుస్తారు ? అన్నది ఆసక్తికరమే.