టాలీవుడ్ సినిమా పరిశ్రమకు ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా తెరకెక్కిన నేను శైలజ అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్, తొలి సినిమాతోనే తన ఆకట్టుకునే అందం మరియు అభినయంతో మంచి నటిగా తెలుగు ప్రేక్షకులతో మార్కులు వేయించుకుంది. ఆ తరువాత నాచురల్ స్టార్ నానితో కలిసి ఆమె నటించిన నేను లోకల్ సినిమా కూడా సూపర్ హిట్ కొట్టి కీర్తికి మంచి పేరు తెచ్చిపెట్టింది. అయితే అనంతరం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి ఆమె నటించిన అజ్ఞాతవాసి సినిమా ఘోరంగా ఫ్లాప్ కావడంతో ఈ అమ్మడుకి కొంత నిరాశే ఎదురయింది. ఆ తరువాత గత ఏడాది నాగ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ సంస్థ నిర్మించిన అలనాటి మహానటి సావిత్రి గారి బయోపిక్ మహానటిలో నటించిన కీర్తి సురేష్, 

ఆ ఒక్క సినిమాతో ఎన్నో ఉన్నత శిఖరాలు అధిష్టించింది. తెలుగుతో పాటు తమిళ్ లో కూడా ఏకకాలంలో రిలీజ్ అయిన ఆ సినిమాలో కీర్తి సురేష్ నటనకు ముగ్ధులు కానివారు లేరనే చెప్పాలి. ఆ సినిమా చూస్తుంటే అప్పటి సావిత్రిగారే మళ్ళి తిరిగివచ్చారా అనేంతలా కీర్తి సురేష్ ఆ పాత్రకు జీవం పోశారు. అంతేకాక ఆ సినిమాలోని అద్భుత నటనకు గాను ఆమెకు ఉత్తమ నటిగా ఏకంగా జాతీయ అవార్డు కూడా లభించడం విశేషం. ఇక నేడు ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఆమె నటిస్తున్న పలు చిత్రాల తాలూకు నిర్మాణ సంస్థలు ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేస్తూ, కొన్ని పోస్టర్స్ ని రిలీజ్ చేసాయి. వాటిలో యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ నిర్మాతగా, 

నూతన దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీకి పెంగ్విన్ అనే టైటిల్ ని నిర్ణయించి ఒక పోస్టర్ ని రిలీజ్ చేశారు ఆ సినిమా యూనిట్ సభ్యులు. ఆ పోస్టర్ లో కీర్తి సురేష్, గర్భవతిగా ఉండడం గమనించవచ్చు, డార్క్ షేడ్ తో కీర్తి ఫేస్ కనపడి కనపకుండా ఉన్న ఆ పోస్టర్, ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆకట్టుకునే ఒక విభిన్న కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి ఒక ఛాలెంజింగ్ రోల్ లో నటిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ పెంగ్విన్ సినిమాను, వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా రిలీజ్ చేయనున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: