పవన్ కళ్యాణ్..ఈ పేరుకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ని ఎస్టిమేట్ చెయ్యడం కష్టం. పవన్కి ఫ్యాన్స్ కంటే భక్తులు ఎక్కువ ఉంటారు. కానీ పవర్ స్టార్ కాస్తా జనసేనానిగా మారి..పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడంతో మెగా ఫ్యాన్స్ ఢీలాపడ్డారు. పవన్ డ్యాన్స్, డైలాగ్స్, మేనరిజమ్స్ మిస్ అవుతున్నామని తెగ ఫీల్ అవుతున్నారు. అన్నయ్య చిరంజీవిలా అన్యాయం చేసి మూవీస్కి దూరమవ్వొద్దని వేడుకుంటున్నారు.మరి పవన్కు తన డివోటీస్ ప్రార్థనలు రీచయ్యయో ఏమో తెలియదు కానీ..అతడు త్వరలోనే సిల్వర్ స్రీన్పై రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడన్న వార్తలు ఊపందుకున్నాయి.
అయితే ప్రస్తుతం పవన్ సినీ రీ ఎంట్రీ దాదాపుగా ఖాయమైపోయినట్టేనని వినిపిస్తోంది. ఇప్పటి వరకు ఈ సినిమాకి రామ్ చరణ్ నిర్మాత అంటూ ప్రచారం సాగినా, పవన్ మాత్రం తొలి ఛాన్స్ ఏ.ఎం.రత్నంకే నని చెప్పాడట. గతంలో పవన్ మాత్రం తాను రాజకీయాలకు అంకితమని.. ఇకపై సినిమాలు చేయనని తెగేసి చెప్పిన విషయం తెలిసిందే. కానీ ఆత్మీయులు ఇచ్చిన సలహాల మేరకు సేనాని మనసు మార్చుకున్నారన్న టాక్ ఇండష్ట్రీలో నడుస్తోంది. ముహుర్తానికి పొంగల్ టైం సెట్ చేసినట్టు వార్తలు తెగ చెక్కర్లు కొడుతున్నాయి.
ఏ.ఎం.రత్నం ఎందుకంటే గతంలో సినిమా కోసమంటూ రత్నం నుంచి పారితోషికం మొత్తాన్ని సింగిల్ పేమెంట్లో అడ్వాన్సు రూపంలో ఇచ్చేశాడు. ముందు ఆ అడ్వాన్స్ క్లియర్ చేయాల్సిన బాధ్యత పవన్పై ఉందకనుక పవన్ తను ఇచ్చిన మాట నిలుపుకునేలా ఈ అవకాశం ఇచ్చినట్టు సమాచారం క్రిష్ దర్శకంత్వంలో రత్నం నిర్మించే ఈ సినిమాలో పవన్ నటించడం దాదాపుగా ఖాయమైపోయింది. మరోవైపు మైత్రీ మూవీస్ కూడా ఇప్పుడు పవన్తో సినిమా చేయాలని తహతహలాడుతోంది. దిల్ రాజు కూడా రెడీ అంటున్నాడు.