మనందరికీ సుపరిచితుడైన ఓంకార్ అన్నయ్య తమ్ముడు అశ్విన్, చిన్నారి పెళ్ళి కూతురు అవికా గోర్‌ జంటగా ఓక్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై ఓంకార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'రాజుగారి గది3'. ఈ శుక్రవారం విడుదల కానున్న నేపథ్యంలో జరిగిన ప్రీ–రిలీజ్‌ వేడుకలో ప్రముఖ కెమెరామన్‌ ఛోటా కె. నాయుడు మాట్లాడుతూ "ఈ చిత్రం అద్భుత విజయం సాధిస్తుంది. ఈ మధ్య సాంకేతిక అభివృద్ధి వల్ల నటీనటుల్లో బద్ధకం పెరిగిందని నేను చెప్పినట్లు ఓ దిన పత్రికలో వచ్చింది. కానీ నా ఉద్దేశం అది కాదు. సాంకేతికత పెరగడం వల్ల సాంకేతిక నిపుణుల పని కాస్త తేలికైందనేది నా అభిప్రాయం’ అంటూ నాయుడు గారు మాట్లాడారు.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా మన ఓంకార్ అన్నయ్య మాట్లాడుతూ "ఒక సాధారణ యాంకర్‌ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదగడానికి కారణం నా తమ్ముళ్లు అశ్విన్, కల్యాణ్‌. వీళ్ళు చదువును కూడా మర్చిపోయి నా కెరీర్‌ కోసం కష్టపడ్డారు., నాకు జన్మనిచ్చింది మా అమ్మానాన్నలు అయితే.. నా సినీ కెరీర్‌కు జన్మనిచ్చింది మాత్రం నా తమ్ముళ్లే., ఈ సినిమాతో అశ్విన్‌ హీరోగా పరిచయం అవుతున్నాడు., కల్యాణ్‌ నిర్మాతగా త్వరలో ఓ సినిమా రాబోతుంది., ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో వరంగల్‌ శ్రీనుగారు డిస్ట్రిబ్యూట్ చేయనున్నారు., గత ఏడాది మా నాన్న గారు చనిపోవడంతో నేను ఎక్కువగా తెల్ల దుస్తుల్లో కనిపిస్తున్నా., ఈ సినిమాతో అశ్విన్‌ను ప్రేక్షకులు హీరోగా అంగీకరించిన తర్వాత తిరిగి మామూలు దుస్తులు వేసుకుంటాను’’ అని చెప్పుకొచ్చారు.

శ్రీను మాట్లాడుతూ "ఓంకార్‌., ‘‘జీనియస్‌’ నుంచి ఇప్పటివరకు ఐదు సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశాను. ‘‘ఇదివరకు ‘హుషారు’, ‘ఇస్మార్ట్‌ శంకర్‌’, ‘గద్దలకొండ గణేష్‌’ సినిమాలను డిస్ట్రిబ్యూట్‌ కూడా చేశాను. ఈ విజయాల వరుసలో ఈ చిత్రం కూడా చేరుతుందని ఆశిస్తున్న అన్నారు.

ఇక అశ్విన్ మాత్రం హీరోగా తన కల నెరవేర బోతున్నందుకు సంతోషిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: