మెగాస్టార్ చిరంజీవి రెండేళ్ల క్రితం వచ్చిన తన కంబ్యాక్ మూవీ ఖైదీ నెంబర్ 150 తో సూపర్ హిట్ ని సొంతం చేసుకుని, తన చరిష్మా మరియు బాక్సాఫీస్ స్టామినా ఇంకా తగ్గలేదని ప్రూవ్ చేసారు. అయితే ఆ సినిమా తరువాత ఆయన నటించిన తదుపరి సినిమా సైరా నరసింహారెడ్డి, ఇటీవల రిలీజ్ అయి యావరేజ్ సినిమాగా నిలిచింది. తొలిసారి ఒక స్వాతంత్రోద్యమ వీరుడిగా నటించిన మెగాస్టార్, ఆ పాత్రలో జీవించారనే అనాలి. మెగాస్టార్ కుమారుడు రామ్ చరణ్ ఎంతో భారీ స్థాయిలో నిర్మించిన ఈ సినిమాలో మెగాస్టార్ సరసన నయనతార హీరోయిన్ గా నటించడం జరిగింది. 

యువ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సెట్టింగ్స్ వంటివి బాగున్నప్పటికీ, సినిమాను పూర్తి స్థాయిలో ఆడియన్స్ ని ఆకట్టుకునేలా తీయడంలో దర్శకుడు సక్సెస్ కాలేదనే విమర్శలు జోరుగా వినపడ్డాయి. ఇకపోతే ఈ సినిమా తరువాత మెగాస్టార్ నటించబోయే 152వ సినిమా పూజా కార్యక్రమాలతో ఇటీవల ఎంతో లాంఛనంగా ప్రారంభమయిన విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిష నటిస్తోందని, 

అలానే ఈ సినిమాకు టైటిల్ గా గోవింద ఆచార్య అనే టైటిల్ నిర్ణయించినట్లుగా రెండు రోజుల నుండి పలు మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వార్తలు ప్రచారం అవుతుండడంతో, ఈ విషయమై ఆ సినిమా యూనిట్ మాత్రం వాటిలో ఏ మాత్రం నిజం లేదని గట్టిగా స్టేట్మెంట్ ఇచ్చిందట. హీరోయిన్ విషయమై దర్శకులు కొరటాల గారు త్వరలో ప్రకటన చేస్తారని, అలానే టైటిల్ విషయమై ప్రస్తుతం యూనిట్ కొంత చర్చిస్తుందని, ఫైనలైజ్ అయిన తరువాత మీడియాకు తెల్పడం జరుగుతుందని, కాబట్టి అప్పటివరకు తమ సినిమాపై వచ్చే పుకార్లను నమ్మవద్దని కోరుతున్నారట. దీనితో మెగాస్టార్ 152వ సినిమా విషయమై ప్రచారం అవుతున్న వార్తలన్నీ ఒట్టి పుకార్లని తేలిపోయింది.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: