బుల్లితెరపై అడపదడపా సీరియళ్లు, వంటల ప్రోగ్రామ్స్, ఆడియో ఫంక్షన్లు చేసుకుంటూ వచ్చిన శ్యామల.. బిగ్ బాస్-2 హౌస్‌లో ఎంట్రీ ఇవ్వడంతో మరింత క్రేజ్ పెరిగిపోయింది.ఈ రియాలిటీ షో నుంచి వచ్చేసిన తర్వాత శ్యామల స్పీడు పెంచేసింది. కెరీర్‌ను గాడిలో పెట్టుకున్న తర్వాత వరుసగా ఏదో ఒక షోలోనో, సినిమా ఈవెంట్‌లోనే కనిపిస్తూనే ఉంది. క్రేజ్‌ను ఉపయోగించుకుంటూ ముందుకు వెlళ్తు.... అవకాశాలను పట్టేస్తుంది.


పిన్ని గారు అంటూ శ్యామలకు నిక్ నేమ్ కూడా పడిపోయింది. శ్యామల.. నరసింహా అనే టీవీ యాక్టర్‌ను వివాహం చేసుకుంది. ఓ సీరియల్ కోసం పరిచయం అయినప్పుడు వీళ్లిద్దరూ ప్రేమలో పడ్డారు. వీరి బంధం పెళ్లి వరకు వెళ్లింది. 2007లో వీరిద్దరూ అగ్ని సాక్షిగా ఒక్కటయ్యారు. ఇప్పుడు ఈ జంటకు ఓ కుమారుడు కూడా ఉన్నారు. అయితే తాజాగా శ్యామల చేసిన పోస్ట్ ఆమెకు పెద్ద తలనొప్పిని తెచ్చినట్లైంది.


 మహిళ.. తల్లి కావడం అనేది ఓ గొప్ప అనుభూతి. జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు, నిద్ర లేని రాత్రులుంటాయి.. కానీ ప్రతీరోజూ ఏదో ఒకటి సాధించినట్లు ఫీల్ అవుతాము. అందుకే ఈ ఆనంద క్షణాలను సెలబ్రేట్ చేసుకోవడానికి నా భర్త నరసింహ.. డైమండ్ బ్రాస్లైట్ కానుకగా ఇచ్చాడు.అయితే ఈ పోస్ట్‌ను చూసిన నెటిజన్లు.. మళ్లీ ప్రెగ్నెంట్ అయ్యారా అంటూ ప్రశ్నలు కురిపించసాగారు. అయితే అలాంటిదేమీ కాదని.. అదొక ప్రకటనకు సంబంధించినదని వివరణ ఇస్తోంది.

దీంతో ఈ పోస్ట్ కొద్దిసేపట్లోనే వైరల్ కాసాగింది. దీంతో మరోసారి శ్యామల వార్తలల్లోకెక్కింది.బిగ్ బాస్ మూడు సీజన్‌లో పాల్గొన్న కంటెస్టెంట్లందరూ ఒక్క ఫ్యామిలీలా కలిసిమెలిసి ఉంటున్నారు. ఎవరి ఇంట్లో ఈవెంట్లు జరిగిన మొదటి రెండు సీజన్ల కంటెస్టెంట్లతో పాటు.. ఇప్పటి వరకు ఎలిమినేట్ అయిన మూడో సీజన్ కంటెస్టెంట్లు కూడా హాజరవుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: