మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ భిన్నమైన కథలను సెలెక్ట్ చేసుకుంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక రికార్డులు ఇటీవల సృష్టిస్తూ వస్తున్నాడు. దంగల్ సినిమా తో అద్భుతమైన విజయాన్ని అందుకొని కెరియర్ ని సక్సెస్ ఫుల్ గా తీసుకెళ్తున్న అమీర్ ఖాన్ తాజాగా తమిళ స్టోరీ ని నమ్ముకుని ఈ సినిమాని రీమేక్ చేయడానికి రెడీ అయినట్లు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి.


గతంలో వరస ఫ్లాపుల్లో ఉన్న అమీర్ ఖాన్ తమిళ సినిమా అయినా గజిని సినిమా ని రీమేక్ చేసి సక్సెస్ ట్రాక్ ఎక్కడం జరిగింది. దీంతో తాజాగా మరొకసారి తమిళ సినిమా అమీర్ ఖాన్ రీమేక్ చేయడంతో ఈ విషయం ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ అయింది. విషయంలోకి వెళితే 2017 వ సంవత్సరం లో తమిళనాడు ఇండస్ట్రీలో విడుదలైన బాక్సాఫీస్ హిట్ గా నిలిచిన విక్రమ్ వేధా సినిమాని అమీర్ ఖాన్ రీమేక్ చేయడానికి రెడీ అయినట్లు సమాచారం.  విజయ్ సేతుపతి - మాధవన్ నటించిన ఈ మినీ మల్టీస్టారర్ ని పుష్కర్ - గాయత్రీ దంపతులు తెరకెక్కించారు.


సినిమా సక్సెస్ కావడంతో ఈ సినిమాను రీమేక్ చేయడానికి చాలా మంది టెక్నీషియన్స్ ముందుకు వచ్చారు. తెలుగులో కూడా సినిమా రీమేక్ కు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక బాలీవుడ్ లో గత కొంత కాలంగా అమీర్ ఖాన్ రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన ఫుల్ స్క్రిప్టుని విన్న అమీర్ ఖాన్ సినిమా రీమేక్ చేయడానికి ప్రయత్నాలు చేసినట్లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు బాలీవుడ్ ఇండస్ట్రీ లో వినపడుతున్న టాక్. అయితే ఈ సినిమాలో విజయ్ సేతుపతి చేసిన క్యారెక్టర్ లో అమీర్ ఖాన్ నటించనున్నట్లు సమాచారం. అలాగే మాధవన్ నటించిన పాత్రలో మరో బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ నటించనున్నారట. ఈ సినిమాకి సంబందించిన పూర్తి వివరాలు అధికారికంగా త్వరలోనే ప్రకటించనున్నట్లు సమాచారం.



మరింత సమాచారం తెలుసుకోండి: