బిగ్ బాస్ హౌస్లో ఇన్ని రోజులు  ఒక రేంజ్ లో ఉంటే, గురువారం ఎపిసోడ్ మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్ గా మారింది  వరుణ్ బామ్మా రాకతో. ఇక బిగ్ బాస్ హౌస్ లోని సభ్యులతో ఓ గేమ్ ఆడిస్తూ వారి బంధువులని ఇంటిలోకి ఒకరి తర్వాత ఒకరిని వరుసగా ప్రవేశ పెడుతున్న విషయం అందరికి తెలిసిందే. ఈ క్రమంలోనే వితికా చెల్లి, అలీ భార్య,  శివజ్యోతి భర్త, బాబా భాస్కర్ భార్య,  పిల్లలు బిగ్ బాస్ ఇంట్లోకి ప్రవేశం చేశారు. ఇక గురువారం ఎపిసోడ్ లో మొదట వరుణ్ బామ్మ, తర్వాత రాహుల్ తల్లి, చివరికి శ్రీముఖి తల్లి హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది.


అయితే వరుణ్ బామ్మ ఇంటిలోకి రావడంతోనే అసలైన  ఫుల్ ఎంటర్టైన్మెంట్ గా మారింది. ఇంటిలోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి నాన్ స్టాప్ గా మాట్లాడుతూ అందరితోనూ సరదాగా సెటైర్లు వేస్తూ బిగ్ బాస్ నే ఒక ఆట ఆడుకుంది వరుణ్ బామ్మ. నాకు వరుణ్, వితికా,  శ్రీముఖిలు తప్ప ఎవరు ఇక్కడ తెలియదని చెప్పారు.  కానీ అందరు ఎక్కడో పుట్టి అందరు ఒకే చోట కలిసి మెలిసి ఇన్ని రోజులు ఉండటం చాలా బాగుందని తెలిపారు.


అలాగే నేను, తాతయ్య  రోజు బిగ్ బాస్ చూస్తాము అని చెప్పుకొచ్చారు. ఇక బాబా భాస్కర్ ని మాత్రం బాగా మెచ్చుకున్నారు.  బాబా భాస్కర్ అందరికీ వంట చేసి పెట్టడం చాల బాగుంది అని తెలిపారు.ఈ విషయం చెప్ప వచ్చో  లేదో కానీ బాబా భాస్కర్ ని  గిన్నీస్ బుక్ లో ఎక్కించాలని తెలిపారు.

ఆ తర్వాత బిగ్ బాస్ మీరు ఎలా ఉంటారు, మీ  ఫోటో ఉంటే  నాకు పంపిస్తారా అని బిగ్ బాస్ ని అడిగారు. నాకి కూడా మీరు టాస్క్ లు ఇస్తే బాగుంటుందని అని బిగ్ బాస్ ని కోరడం జరిగింది. నెక్స్ట్ సీజన్ కి  మా వాళ్ళని ఎవరినో ఒకరి తీసుకుని బిగ్ బాస్ కు  నేను వస్తా అంటూ బిగ్ బాస్ ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. బామ్మ హౌస్లోకి రావడంతో  కంటెస్టంట్స్ తో పాటు,  ప్రేక్షకులు అందరికి కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్ గా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: