బాలీవుడ్ నుండి వచ్చి ఇక్కడ క్రేజ్ సంపాదించిన వారిలో ఈమధ్య కాలంలో కియరా అద్వాని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. బాలీవుడ్ లో సినిమాలతో పాటుగా వెబ్ సీరీస్ లు కూడా చేస్తూ క్రేజ్ తెచ్చుకున్న కియరా అద్వాని తెలుగులో మహేష్ సరసన భరత్ అనే నేను సినిమాలో నటించి మెప్పించింది. ఇక ఆ తర్వాత రాం చరణ్ తో వినయ విధేయ రామలో కూడా నటించింది.


ఓ పక్క బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలు చేస్తున్న కియరా అద్వాని తెలుగులో కూడా క్రేజీ ఛాన్సులు పట్టేస్తుంది. తెలుగులో ప్రస్తుతం రెండు మూడు సినిమాలు డిస్కషన్స్ లో ఉన్నాయని తెలుస్తుంది. ఇదిలాఉంటే తన కెరియర్ ఇంత సక్సెస్ ఫుల్ గా నడుస్తున్నందుకు సంతోషిస్తున్న కియరా హిందితో పాటు ఇతర భాషల్లో సినిమాలు చేయడం తన అదృష్టమని అన్నది.


అంతేకాదు కేవలం అందం ఒక్కటే ఉంటే అవకాశాలు రావని వాటితోపాటే ప్రతిభ కూడా ఉండాల్సిందే అంటుంది కియరా. మోడల్ గా కెరియర్ ప్రారంభించిన కియరా బాలీవుడ్ లో సినిమాలు చేస్తూనే లస్ట్ స్టోరీస్ వెబ్ సీరీస్ తో అదరగొట్టింది. రీసెంట్ గా కబీర్ సింగ్ సినిమాతో కూడా హిట్టు దక్కించుకుంది కియరా అద్వాని.


ప్రతిభ ఉంటే ఒకసారి కాకపోయినా ఎప్పుడో ఒకప్పుడు సక్సెస్ మన వెంట వస్తుందని చెబుతుంది కియరా అద్వాని. ఒక సినిమా హిట్టు పడగానే కాస్త కూస్తో స్టైల్ కొట్టే భామలు ఉండగా కియరా మాత్రం ప్రతి సినిమా తన మొదటి సినిమాగా చేస్తుందని తెలుస్తుంది. అందుకే ఆమె వెంట సక్సెస్ తోడుగా ఉంటుంది. మహేష్, చరణ్ ల సినిమాల తర్వాత తెలుగులో మళ్లీ స్టార్ ఛాన్సులు వచ్చినా బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఆమె ఒప్పుకోలేదని అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: