సూపర్ స్టార్ రజినీ కాంత్, స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం 'దర్బార్'. ఇటీవలే ఈచిత్రం షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యకమాలను కూడా శరవేగంగా జరుపుకుంటుంది. ఈ చిత్రంలో రజినీ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఇంతకి సినిమాలో ఆయన పేరేంటంటే ...
ఆదిత్య అరుణాచలం. అయితే రజినీ పాత్రకు మురగదాస్ ఈ పేరును పెట్టడానికి బలమైన కారణం వుంది. మురగదాస్ కొడుకు పేరు ఆదిత్య కాగా తండ్రి పేరు అరుణాచలం. అలా కొడుకు , తండ్రి పేరును కలిపి దర్బార్ లో రజినీ క్యారెక్టర్ నేమ్ గా సెట్ చేశాడు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో
నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా యువనటి
నివేద థామస్ రజినీకి కూతరుగా కనిపించనుంది. వీరితోపాటు బాలీవుడ్ ప్రముఖ నటులు
సునీల్ శెట్టి ,
ప్రతీక్ బబ్బర్ ,
దిలీప్ తాహిల్ , జతిన్ సర్ణ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. మురగదాస్ - రజినీ కాంబినేషన్ లో వస్తున్న మొదటి చిత్రం కావడంతో దర్బార్ పై భారీ అంచనాలు వున్నాయి.
ఈ చిత్రాన్ని ఓవర్సీస్ లో ఫార్స్ ఫిలిమ్స్ విడుదలచేస్తుంది. ఇందుకోసం ఆ సంస్థ ఏకంగా 38కోట్లకు ఆహక్కులను సొంతం చేసుకుంది. ఇక దర్బార్ తెలుగు వెర్షన్ థియేట్రికల్ హక్కులను ఎన్వీ ప్రసాద్ దక్కించుకున్నాడు. ఈచిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలకానుంది. అయితే తెలుగులో మాత్రం దర్బార్ కు గట్టి పోటీ ఎదురుకానుంది. ఎందుకంటే సంక్రాంతి ని టార్గెట్ చేస్తూ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు , అల్లు అర్జున్ అల.. వైకుంఠపురములో.. చిత్రాలు బరిలో వున్నాయి.