ఇటీవల త్రివిక్రమ్  అరవింద సమేత సినిమాతో మంచి హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. త్రివిక్రమ్ - అల్లు అర్జున్ కాంబినేషన్లో రాబోతున్న 'అల వైకుంఠపురములో' సినిమాలో పూజా హెగ్లేతో పాటు నివేతా పేతురాజ్ కూడా ఒక పాత్రలో నటిస్తుందని సంగతి అందరికి తెలిసిన విషయమే. ఇక త్రివిక్రమ్ చేసే ప్రతి సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉండడం కామన్ అయిపోయింది.


గతంలో  'అత్తారింటికి దారేది' నుంచి ఇటీవల విడుదలైన  'అరవింద సమేత' వరకూ త్రివిక్రమ్  కంబినేషన్లో వచ్చిన ప్రతి సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ కామన్. ప్రస్తుతం చేస్తున్న 'అల వైకుంఠపురములో' సినిమాలో కూడా ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు. ఇందులో నివేతా పేతురాజ్ సెకండ్ పార్టీలో కనిపించనుంది. అయితే ఇంతవరకు త్రివిక్రమ్.. నివేతా క్యారెక్టర్ ఏంటనేది ఎక్కడా రివీల్ చేయలేదు. అసలు ఈ మూవీలో ఈమెది స్కోప్ ఉండే క్యారక్షరా? లేదా అనే అనుమానాలు మొదలయ్యాయి. 


సాధారణంగా స్వామి సినిమాలో సెకండ్ పాత్రకి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. మరి ఇందులో నివేతా క్యారెక్టర్ ఏంటో? తెలియడంలేదు. కనీసం టీజర్ లోనో లేదా ఏదైనా క్యారెక్టర్ పోస్టర్ లోనూ నివేతా గురించి చెప్తే తప్ప సినిమాలో ఆమెను ఎందుకు తీసుకున్నారనే విషయం ఇంకా బయటికి రాలేదు. మరి గురూజీ త్రివిక్రమ్ ఏం ఆలోచిస్తాడో చూడాలి మరి. ఇక ఈ సినిమా వచ్చే సంవత్సరం సంక్రాంతి సీజన్లో జనవరి 12న రిలీజ్ అవుతుంది అని సినిమా యూనిట్ తెలిపారు.


త్రివిక్రమ్ సినిమాలకు  తెలుగు ఇండస్ట్రీలో  బాగా మంచి పేరు ఉంది. ఇంకా ప్రేక్షకులు కూడా బాగా నచ్చుతుంది త్రివిక్రమ్ సినిమాలు. అల వైకుంఠపురము సినిమా మీద బన్నీ ఫ్యాన్క్స్ బాగా ఆశలు పెట్టుకున్నారు. చాల రోజుల తర్వాత బన్నీ సినిమా తీయడం  ఫ్యాన్క్స్ కి బాగా పండుగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

raj