పెళ్లంటే నూరేళ్ళ పంట అంటారు.. ఇద్దరి మనసులను తాళి అనే ఒక బంధంతో ఏకం చేసే ఒక అద్భుత ఘట్టం. వేదమంత్రాల సాక్షిగా, పచ్చని పందిరి, వాయిద్యాలు, ఏడడుగులు వేసి బందుజనం మధ్య ఏకమైతే అది పెళ్లి అంటారు. స్వర్గంలో ఎవరితో అయితే నిర్ణయిస్తే వారితోనే ముడి పడుతుందట. ఆ విషయం పెద్దలు చెప్తున్నారు.పెళ్లి అనేది జీవితంలో ఒకరితోనే జరుగుతుంది. 


ఇక్కడ ఇది విడ్డూరం గా జరిగింది. ఒక అమ్మాయి 20 పెళ్లిళ్లు చేసుకుంది. అదేనండి.. 20  సార్లు పెళ్లిచేసున్నా అని ఆమె వెల్లడించింది. చిన్నారి పెళ్లికూతురు సీరియల్ అందరికి గుర్తుంది కదా ఆమె అవికా గోర్ .. సీరియల్‌తో ఆమెకు దేశ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. సీరియల్స్‌లో మాత్రమే కాకుండా హిందీ సినిమాల్లోనూ బాలనటిగా నటించింది. అలా ఆమె చాలా యాడ్స్ కూడా చేసింది.. 


ఇకపోతే ఈమె తెలుగులో రాజ్ తరుణ్ హీరోగా వచ్చిన పల్లెటూరు వాతావరణంలో  తెరకెక్కిన సినిమా ఉయ్యాలా జంపాల సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా తక్కువ బడ్జెట్ తో తక్కువ కథతో వచ్చిన కూడా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత నాగ సౌర్య నటించిన లక్ష్మి రావె మా ఇంటికి సినిమాలో నటించింది. మల్లి రాజ్ తరుణ్ తో సినిమా చూపిస్తా సినిమాలో నటించింది. 



చాలా సినిమాలలో నటించిన కూడా ఆమెకు ఎక్కడా నటిగా గుర్తింపు తెచ్చుకోలేదు . అయితే, తాజాగా ఆమె ‘రాజుగారి గది 3’లో హీరోయిన్‌గా నటించింది. ఓంకార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  ఈ సందర్బంగా ఆమె ఓ ఛానెల్ కి  ఇంటర్వ్యూ కి ఇచ్చింది. ఇందులో ఆమెకు ప్రశ్న ఎదురైంది.  నాకు 20 సార్లు పెళ్లయింది. ఇప్పుడు పెళ్లి పేరు చెబితే నాకు అలసట వస్తోంది. నా వల్ల కాదు’’ అని నవ్వుతూ చెప్పింది అవికా. ఆమె చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. 



మరింత సమాచారం తెలుసుకోండి: