నా పేరుసూర్య  తరువాత ఏడాది  గ్యాప్ తీసుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్  ప్రస్తుతం  త్రివిక్రమ్ డైరెక్షన్ లో  అల .. వైకుంఠపురములో.. అనే చిత్రంలో నటిస్తున్నాడు. నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలకానుంది. ఇటీవల  ఈ చిత్రం నుండి  విడుదలైన  'సామజవరగమన' సాంగ్  ఇప్పటివరకు  యూ ట్యూబ్ లో 40మిలియన్ల పై  చిలుకు వ్యూస్ రాబట్టుకొని సాంగ్ అఫ్ ది ఇయర్ అనిపించుకుంది.  ఈ సాంగ్ తో సినిమా పై అంచనాలు మరింతగా పెరిగాయి.



ఇక అల .. వైకుంఠపురములో..  తెలుగు , మలయాళ  వెర్షన్ ల శాటిలైట్ , డిజిటల్ రైట్స్ డీల్ 29కోట్లకు  క్లోజ్ అయ్యిందని సమాచారం. తద్వారా బన్నీ కెరీర్ లో అత్యధిక నాన్ థియేట్రికల్ బిజినెస్ చేసిన చిత్రంగా అల... వైకుంఠపురములో.. రికార్డు సృష్టించింది. ఇంతకుముందు నాపేరు సూర్య హిందీ డబ్బింగ్ రైట్స్ తోపాటు  తెలుగు, మలయాళం శాటిలైట్, డిజిటల్ రైట్స్  అన్ని కలుపుకొని 24కోట్ల బిజినెస్ చేసింది. అయితే   బన్నీ నటించిన  సినిమాలకు  హిందీ లో కూడా ఎక్కువ ఆధరణ ఉండడం తో  అల.. వైకుంఠపురములో  చిత్రం యొక్క  హిందీ డబ్బింగ్ రైట్స్  డీల్ ను హోల్డ్ లో పెట్టారట.  భారీ ధరకు ఆ రైట్స్ ను అమ్మాలని చూస్తున్నారు నిర్మాతలు. 



పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈచిత్రంలో బన్నీ  సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా కనిపించనుండగా ఆయనకు జోడిగా పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.  తమన్  సంగీతం అందిస్తున్నాడు.  గీతా ఆర్ట్స్ , హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో  టబు , జయరాం , మురళి శర్మ , నవదీప్ , సుశాంత్ , నివేత పేతురేజ్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: