బాలీవుడ్ స్టార్ హీరో
అక్షయ్ కుమార్ చేసిన పని వల్ల నటి
విద్యా బాలన్ పరువు పోయి ఉండేదట. సెట్లో
అక్షయ్ ఫ్రాంక్ కాల్ చేస్తుంటాడన్న సంగతి చాలామందికి తెలిసిన విషయమే. ఆయనకు ఈ అలవాటు ఎప్పటి నుంచో ఉంది. ఆయన అతి ఉత్సహం తో చేసే ఈ ఫ్రాంక్ కాల్ వల్ల మిగతా నటీనటులు అప్పుడప్పుడు ఇబ్బందుల్లో పడుతుంటారు. అలానే ఒకసారి విద్యా బాలన్ తోనూ
అక్షయ్ ఫ్రాంక్ కాల్ చేశాడు. 2007లో
అక్షయ్ కుమార్, రితేష్ దేశ్ముఖ్,
విద్యా బాలన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'హే బేబీ'. ఈ సినిమా షూటింగ్ సమయంలో అక్షయ్.. రితేష్ ఫోన్ నుంచి విద్యా బాలన్ కు 'ఐ లవ్యూ' అంటూ ముద్దులు పెడుతున్న మెసేజ్ పెట్టాడట. ఆ తర్వాత
విద్యా బాలన్ ఫోన్ తీసుకుని.. 'ఐ లవ్యూ టూ' అని మెసేజ్ పెట్టాడట.
షూటింగ్ మధ్యలో రితేష్ తన ఫోన్ తీసి చూసుకుని షాకయ్యాడట.
విద్యా బాలన్ ఇలా ఎందుకు చేశారు? అని ఆమెను అనుమానించాడు కూడా. ఆ తర్వాత తెలిసిన అసలు విషయం తెలుసుకొని అవాక్కయ్యాడట.
అక్షయ్ కుమార్ చేసిన ఈ పనిని రితేష్.. 'హౌస్ఫుల్ 4' ప్రమోషన్స్లో భాగంగా వెల్లడించారు. 'విద్యా నాకు ముద్దులు పెడుతూ మెసేజ్ చేసే సరికి షాకయ్యా. అసలు నేను మెసేజ్ చేయకుండా ఆమె ఇలా ఎందుకు చేశారు అని కంగారుపడ్డా. ఆ తర్వాత తెలిసింది ఇది
అక్షయ్ చేసిన పని అని. ఇలా ఎందుకు చేశావ్ అని నేను అక్షయ్ని గట్టిగా అడిగితే.. ఫ్రాంక్ కాల్ చేయడంలో ఓ మజా ఉంటుంది అంటు' అని నవ్వాడని వెల్లడించాడు.
ఇది అక్షయ్కి సరదా అనిపించినా ఈ విషయం కాస్త సీరియస్ అయివుంటే పరిస్థితేంటి అని రితేష్ ఒక్క క్షణం టెన్షన్ పడ్డాడట. ఎందుకంటే అప్పటికే రితేష్.. జెనీలియా ప్రేమలో ఉన్నారు. అలానే విద్యా బాలన్.. ప్రముఖ నిర్మాత
సిద్ధార్థ్ రాయ్ కపూర్తో డేటింగ్లో ఉన్నారు.
అక్షయ్ పిచ్చి ఫ్రాంక్ కాల్ గనక తేడా కొట్టి ఉంటే ఈ ఇద్దరి జీవితాలు దెబ్బతినేవి.
అక్షయ్ ముందే నేనే ఈ ఫ్రాంక్ కాల్ చేశానని చెప్పడంతో విషయం సీరియస్ అవకుండా ఆగిపోయిందని రితేష్ చెప్పాడు.
అక్షయ్ కుమార్, రితేష్ దేశ్ముఖ్,
బాబీ డియోల్ నటించిన 'హౌస్ఫుల్ 4' సినిమాలో కృతి సనన్, కృతి కర్బంద, పూజా హెగ్దే హీరోయిన్స్గా నటించారు. ఫర్హాద్ సంఝీ దర్శకత్వం వహించిన ఈ సినిమా దీపావళి సందర్భంగా ఈ నెల 25 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.