బిగ్ బాస్ లో ఈ వారం చాలా సాఫీగా సాగిపోయింది. బిగ్ బాస్ హోటల్ కి వచ్చిన గెస్ట్ లతో హౌస్ మొత్తం ఎమోషనల్ గా మారిపోయింది. అయితే అప్పుడే శనివారం వచ్చేసింది. ఈ వారం నామినేషన్ ప్రక్రియ నుండి మొదలు పెడితే శుక్రవారం వరకు కంటెస్టెంట్స్ కొన్ని తప్పులు చేశారు. అయితే ఆ తప్పులని ఎత్తి చూపి నాగార్జున సమాధానాలు రాబట్టాలని ప్రేక్షకులు భావిస్తున్నారు. అయితే ఆ ప్రశ్నలేంటో  ఇప్పుడు చూద్దాం.


మొదటగా నామినేషన్ ప్రక్రియ శివజ్యోతి, వరుణ్ ల గొడవ వల్లే రద్దయిందని తెలిసిందే. అయితే వీరిద్దరిలో ఎవరికి వారు తామేం చేయలేదని, అవతలి వారి వల్లే ప్రక్రియ రద్దయిందని భావిస్తున్నారు. వారం నుండి ఈ విషయం ఒక కొలిక్కి రావట్లేదు. ఈ విషయంలో నాగార్జున ఎవరికి మద్దతు తెలుపుతాడనేది ఆసక్తిగా ఉంది. ఇక రెండోది,ఒకానొక టాస్క్ లలో వరుణ్, రాహుల్ ల మధ్య గొడవ జరిగితే నాగార్జుననే కలిపాడు.


అయితే ఈ వారం వారిద్దరి మధ్య ఎలాంటి గొడవ జరగలేదు. కానీ వీరిద్దరూ దూరం దూరంగా ఉంటున్నారు. అంతే కాదు ఒకరి గురించి మరొకరు అవతలి వారితో చెడుగా చెప్పుకుంటున్నారు. ఒకసారి దగ్గరుండి వీరిద్దరినీ కలిపిన నాగార్జున ఈ విషయంలో ఒక క్లారిటీ ఇస్తాడేమో చూడాలి. ఇక మూడో ప్రశ్న ఏంటంటే, నామినేషన్ ప్రక్రియ జరిగినపుడు బాబా భాస్కర్ తన ఫస్ట్ ర్యాంక్ ని శ్రీముఖి కోసం ఇచ్చేస్తా అని చెప్పినా కూడా శ్రీముఖి రాహుల్ వద్దకి వెళ్ళి గొడవ పెట్టుకుంటుంది.


ముందు రాహుల్, వితికాలని అడిగిన తర్వాత ఫస్ట్ ర్యాంక్ వద్దకి వస్తుంది. ఆమెకి ఫస్ట్ ర్యాంక్ కావాలనుకున్నప్పుడు డైరెక్ట్ గా బాబా గారి దగ్గరికే వస్తే అయిపోయేదు. కానీ శ్రీముఖి అలా చేయలేదు. ఈ విషయం నాగార్జున అడగాలని ప్రేక్షకులు భావిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: