టాలీవుడ్ సూపర్ స్టార్
మహేష్ బాబు కి కూతురు, కొడుకు మాత్రమే ఉన్నారు..మరి ఇద్దరు కూతుళ్లను ఒకే ఫ్రేమ్ లో ఎలా బంధించాడా అని ఆలోచిస్తున్నారా? అబ్బే
మహేష్ అంటే తెలుగు సూపర్ స్టార్
మహేష్ కాదండీ..బాలీవుడ్ స్టార డైరెక్టర్, నిర్మాత
మహేష్ భట్. అడల్ట్ మూవీస్ తీయడంలో
మహేష్ భట్ దిట్ట. ఆయన దర్శకత్వంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి.
మహేష్ భట్ కి ఇద్దరు కూతుళ్లు..పూజా భట్, ఆలియాభట్.
బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మహేష్ భట్ చివరిగా 1999లో కర్తూస్ అనే మూవీ చేశాడు. ఒకప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్,
పూజా భట్ కాంబినేషన్ లో వచ్చిన ‘సడక్’ సూపర్ హిట్ అయ్యింది. బాంబేలో ఓ వ్యభిచార ముఠా పూజా భట్ని బలవంతంగా ఎత్తుకెళ్ళి ఆమె వ్యభిచారంలోకి దింపేందుకు ప్రయత్నించగా, టాక్సీ డ్రైవర్గా పనిచేస్తున్న సంజయ్ ఆమె ప్రేమలో పడి పూజాని అక్కడి నుండి తప్పిస్తాడు. వారి మధ్య జరిగిన ఆసక్తికర సన్నివేశాలతో సడక్ చిత్రం రూపొందింది. 1991లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ని షేక్ చేసింది. ఇప్పుడు సడక్ 2 సీక్వెల్ కి ప్లాన్ చేస్తున్నారు. దాదాపు 27 ఏళ్ళ తర్వాత సడక్ మూవీకి సీక్వెల్గా సడక్ 2 ని మహేష్ భట్ తెరకెక్కిస్తున్నాడు.
ఈ మూవీలో సంజయ్ దత్, పూజా భట్,
ఆదిత్య రాయ్ కపూర్తో పాటు అలియాభట్ కూడా నటిస్తుంది. తొలి సారి తన తండ్రి దర్శకత్వంలో అలియా నటిస్తుంది. 2020లో మార్చి 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా మహేష్ భట్ తాజాగా తన ఇద్దరు కూతుళ్ళు అలియా భట్,పూజా భట్లని ఒకే ఫ్రేములో బంధించిన ఫోటోని ట్విట్టర్లో షేర్ చేశాడు. దీనికి సడక్ సెట్స్లో.. 40వ రోజు అని కామెంట్ పెట్టాడు.