కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా,శ్రీనిధి  హీరోయిన్ గా నటించిన 'కెజిఎఫ్' కన్నడతో పాటు తెలుగు, తమిళం, హిందీలో కూడా  విడుదలై సంచలన విజయం అందుకున్న సంగతి తెలిసిందే. కేజీఎఫ్‌ లో చాప్టర్‌ 1  ఎంత  హిట్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హీరోగా నటించిన యశ్‌ కెరీర్‌కు ఈ సినిమా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది, కానీ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన శ్రీనిధి శెట్టికి మాత్రం  పెద్దగా చెప్పుకోదగ్గ పాత్రా లేదు. తన పాత్రకు అంత ప్రాముఖ్యత లేకపోవడం, పైగా ఇది యాక్షన్‌ మూవీ అవట్టం వల్ల, శ్రీనిధికి పెద్దగా గుర్తింపు కలగలేదు అనే చెప్పాలి. కానీ  ఇప్పుడు అద్భుతమయిన  అవకాశం ఆమెను వెతుక్కుంటూ  మరీ వచ్చింది. కోలీవుడ్‌ లోకి ఎంట్రీ టికెట్ ఇచ్చింది.. 

అజయ్‌ జ్ఞానముత్తు దర్శకత్వంలో,విక్రమ్‌ హీరోగా,ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి అందరికి తెలిసిన విషయమే.ప్రస్తుతం ఈ సినిమాలో మెయిన్  హీరోయిన్‌గా శ్రీనిధిని తీసుకున్నట్టు తెలుస్తుంది.విక్రమ్‌ వంటి పెద్ద స్టార్ హీరోతో తన కెరీర్ మొదటిలోనే నటించే అవకాశం దొరకటం తన అదృష్టం అని,తను చాలా  లక్కీ అని,ఈ ఛాన్స్అ ఇచ్చిన అజయ్ గారికి థ్యాంక్స్‌ అంటూ పేర్కొన్నారు శ్రీనిధి.

 ఈ సినిమాకు విక్రమ్ 58 ,అనే పేరు ఖరారు అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఈ సినిమాలో మరో హీరోయిన్ పాత్రలో  ప్రియా భవానీ శంకర్,మరియు ముఖ్యమయిన పాత్రలో  క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్  కూడా నటించనున్నారు.మొన్న టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఒక ఇంటర్వ్యూలో  శ్రీనిధి మాట్లాడుతూ, తాను అజయ్ కి అభిమానినని , అతను చేసిన  ఇమైక్కా నోడిగల్  సినిమా తనకెంతో నచ్చింది అని ,ఆయన రచనలు తనకు  బాగా నచ్చుతాయి అని చెప్పారు నిధి.అందుకే  నేను  విక్రమ్ సినిమా అనగానే,ఇంకేం ఆలోచించకుండా సంతకం చేసేసాను అని అన్నారు.దీనికి తోడు,  విక్రమ్ లాంటి  స్టార్ సరసన  తాను చేయటం,మరియు ఎఆర్ రెహమాన్  వంటి గొప్పవాళ్ళు  ఈ  సినిమాకి సంగీతం అందించటం,ఖచ్చితంగా  ఇవ్వని తనకి ప్లస్ అని అంటున్నది కెజిఫ్ భామ.ఎలా అయితేనేం మంచి లక్కీ ఛాన్స్ కొట్టేసింది అప్పుడే అంటున్నారు విన్నవాళ్లంతా.


మరింత సమాచారం తెలుసుకోండి: