ఒక ప్రముఖ హీరోయిన్ ముందు బాలక్రిష్ణ గురించి నోరు జారిన రవితేజను వెతికి మరీ కొట్టిన బాలయ్య బాబు ఇప్పుడు మరోసారి బాక్స్ ఆఫీస్ వద్ద రవితేజతో పోటీ పడబోతున్నట్టుగా ప్రచారాలు జరుగుతున్నాయి. గతంలో రవితేజ తో రెండుసార్లు బాక్స్ ఆఫీస్ వద్ద తలబడిన బాలయ్య ఓడిపోయారు.. ఈ రెండుసార్లు కూడా రవితేజనే విజయం సాధించారు.. 2008 సంక్రాంతికి ‘ఒక్క మగాడు’, ‘కృష్ణ’ రిలీజ్ కాగా.. బాలయ్య సినిమా డిజాస్టర్ అయింది. రవితేజ మూవీ సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత 2011 సంక్రాంతికి మరో మారు ఈ ఇద్దరు తలపడ్డారు.. అప్పుడు బాలయ్య సినిమా ‘పరమ వీర చక్ర’ అట్టర్ ఫ్లాప్ అయితే.. రవితేజ సినిమా ‘మిరపకాయ్’ మాత్రం బాగా ఆడింది. ఆ తర్వాత వీళ్లిద్దరి మధ్య పోటీ ఇప్పటి వరకూ కనపడలేదు..

ఐతే ఈ ఏడాది క్రిస్మస్ పండక్కి మాత్రం బాక్సాఫీస్ దగ్గర మరోసారి బాలయ్య-రవితేజ పోటీ పడుతున్నట్టుగా ప్రచారాలు జరుగుతున్నాయి. మాస్ మాహా రాజా రవితేజ తీస్తున్న కొత్త సినిమా ‘డిస్కో రాజా’ను క్రిస్మస్‌కే రిలీజ్ చేస్తున్నట్లుగా ఇంతకుముందు ప్రకటించారు. అయితే కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో బాలయ్య బాబు నటిస్తున్న కొత్త చిత్రాన్ని ముందు సంక్రాంతికి అనుకున్నా.. తర్వాత వెనక్కి తీసుకొచ్చి క్రిస్మస్ రేసులో నిలపబోతున్నట్లు వార్తలు నడుస్తున్నాయి. ఒకవేళ ఇదే కనుక నిజమైతే మరోసారి ఈ మాస్ హీరోల పోరు పక్కా అంటున్నారు సినీ పెద్దలు.

కానీ లేటుగా రావాల్సిన బాలయ్య సినిమా ముందుకు వస్తే.. క్రిస్మస్‌కే రావాల్సిన మాస్ రాజా రేసు నుంచి తప్పుకుని ఫిబ్రవరికి వెళ్లిపోయినట్లుగా కూడా కొన్ని ప్రచారాలు. దీంతో పాటుగా నితిన్ మూవీ ‘భీష్మ’ను కూడా ఇదే తరహాలో వాయిదా వేశారట. క్రిస్మస్‌కు సాయిధరమ్ తేజ్ మూవీ ‘ప్రతి రోజూ పండగే’తో బాలయ్య చిత్రం పోటీ పడుతుందన్నది తాజా సమాచారం. సంక్రాంతి కి రిలీజ్ కావాల్సిన సినిమాలన్నీ ఇలా వాయిదా పడటానికి కారణం అల్లు అర్జున్., మహేష్ బాబు సినిమాలేనేమో మరి..

మరింత సమాచారం తెలుసుకోండి: